సాధారణంగా మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది..ఎందుకంటే వారు సొంత స్థానాల కంటే రాష్ట్రం పై ఎక్కువ ఫోకస్ పెడతారు. దీని వల్ల సొంత స్థానాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల వ్యతిరేకత తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న మంత్రుల పనితీరు భిన్నంగా ఉంది. ఇటు సొంత స్థానాల్లో వారు చేసేదేమీ లేదు..అటు రాష్ట్రంలో కూడా చేసేదేమీ లేదు. దీంతో వారిపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకే తెలియదు.
అంటే మంత్రుల పరిస్తితి అలా ఉందని చెప్పవచ్చు. అందుకే 25 మంది మంత్రులు ఉంటే..అందులో 15 మంది పైనే ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. ఈ సారి వారికి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక విశాఖ రాజధాని అంటూ హడావిడి చేస్తున్న ఉత్తరాంధ్ర మంత్రులకు ఒరిగేది ఏమి లేదు. రాజధాని తెస్తామని చెబుతున్నా అక్కడి ప్రజలు నమ్మడం లేదు.
అభివృద్ధి చేయకుండా రాజధాని అంటే నమ్మడం లేదు. పైగా సొంత స్థానాలకు మంత్రులు చేసేదేమీ లేదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మొత్తం 6 గురు మంత్రులు ఉన్నారు. అందులో ఓ ఇద్దరు మాత్రమే ఈ సారి గట్టెక్కేలా ఉన్నారు. శ్రీకాకుళంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజులు ఓటమి అంచున ఉన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీలో ధర్మాన, పలాసలో అప్పలరాజుకు గెలుపు అవకాశాలు కనిపించడం లేదు.
ఇక విశాఖల తెగ హడావిడి చేస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లిలో గెలుపు అవకాశాలు శూన్యమని తేలింది. ఇటు మాడుగులలో బూడి ముత్యాలనాయుడు పరిస్తితి బాగోలేదు. ఇక విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, సాలూరులో రాజన్న దొరకు మాత్రం కాస్త అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఉత్తరాంధ్రలో నలుగురు మంత్రులకు దెబ్బపడేలా ఉంది.