మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలు ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. వీరి ఎంగేజ్ మెంట్ అయిన కొద్ది గంటల్లోనే అల్లు అరవింద్ మాట్లాడిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అల్లు అరవింద్ ఇంతక ముందే మరో మెగా హీరో గురించి కూడా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఆ హీరో ఎవరో తెలుసా..ఆయనే హీరో సాయిధరమ్ తేజ్. అసలు విషయం ఏంటో తెలుసా? రండి చూసేద్దాం.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అంతక ముందే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సాయిధరమ్ తేజ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తరువాత వీరుపాక్షి సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడు. అయితే ఇప్పుడు మరో హాట్ టాపిక్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అదే సాయిధరమ్ తేజ్ పెళ్లి టాపిక్. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తరువాత సాయిధరమ్ తేజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడని టాక్ నడుస్తోంది. గతంలో సాయిధరమ్ తేజ్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆ హీరోయిన్ కూడా ఎవరో కాదు, తనతో రెండు సినిమాల్లో నటించిన రెజీనా కసాండ్రా. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాల్లో నటించేటప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమ వరకు దారితీసిందని, ఇద్దరు కలిసి తిరిగేవరనే వార్తలు అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించేవి.
కానీ ఇటీవల కొంతమంది కోసం తనకి ఇష్టమైన దాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది అంటూ సాయి ధరంతేజ్ ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ రెజీనాని ఉద్దేశించే ఇలా చేశారు అని మాట్లాడుకున్నారు. అయితే సాయితేజ్, రెజీనా ప్రేమకు కూడా అరవింద్ పరోక్షంగా కారణమైనట్టే..! ఆయన నిర్మించిన పిల్లానువ్వు లేని జీవితం టైంలోనే వీరు స్నేహితులు అయ్యారు. ఇలా వరుణ్తేజ్ – లావణ్య పెళ్లిపై ముందే హింట్ ఇచ్చిన అరవింద్ ఇప్పుడు సాయితేజ్ – రెజీనా పెళ్లికి కూడా కీలకం అవుతారా ? అన్నది కాలమే నిర్ణయించాలి.