సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌… అక్కినేని వ‌ర్సెస్ శోభ‌న్‌బాబు రాద్దాంతం…!

సినిమా రంగంలోకి వ‌చ్చాక‌..అనేక మంది ప‌రిచ‌యం అవుతారు. వీరిలో భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు ఉన్న వారు ఉంటారు. కొంద‌రు.. త‌క్కువ ఖ‌ర్చులో సినిమాలుచేసే నిర్మాత‌లు ఉంటే.. మ‌రికొంద‌రు ద‌ర్పానికి పోతారు. ఎవ‌రు ఏం చేసినా.. అంతిమంగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణే ముఖ్యం. ఈ విష‌యంలో ముందుగానే అంచ నాలు వేసుకునే నిర్మాత‌లు చాలా త‌క్కువ మంది ఉంటారు. దీంతో వారు న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా.. వారి న‌ష్టాలను యూనిట్ పై కూడా రుద్దేవారు.

అయితే.. ఇలాంటి వారంటే.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సోగ్గాడు శోభ‌న్‌బాబుకు ఏమాత్రం న‌చ్చేది కాదు. దీంతో నిర్మాత‌ల‌ను బ‌ట్టి వారు వ్య‌వ‌హ‌రించుకునేవారు. ఒక్కొక్క‌సారి సినిమాలు చేయ‌ని సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ విష‌యంలో అక్కినేని కొంత లౌక్యంతో త‌ప్పించుకునేవారు. కానీ, శోభ‌న్‌బాబు మాత్రం మొహం మీదే చెప్పేసేవారు. దీంతో కొంద‌రు నిర్మాత‌లు.. ద‌ర్శ‌కుల‌తో రిక‌మండేష‌న్ చేయించుకునేవారు.

`ముంద‌డుగు` సినిమా హీరో కృష్ణ‌, శోభ‌న్ బాబు క‌లిసినటించారు. ఇది అప్ప‌ట్లో ఒక ప్ర‌యోగంగానే చెప్పుకొనేవారు. ఇద్ద‌రు అగ్ర‌హీరోలు.. ఒక కీల‌క స‌మ‌యంలో క‌లిసి న‌టించ‌డం.. చ‌ర్చ‌కు కూడా వచ్చింది. వేటూరి పాట‌ల‌కు..ప్రేక్ష‌కులు మైమ‌రిచిపోయారు. అయితే.. ఈ సినిమా కోస్తా, సీడెడ్‌లో ఆడినా. నైజాంలో బ‌కెట్ త‌న్నేసింది. దీంతో నిర్మాత‌కు అటు ఇటుగా డ‌బ్బు చేతికి అందింది. భారీ న‌ష్టాలు రాలేదు. కానీ, కొంత మేర‌కు న‌ష్ట‌పోయారు.

ఈ విష‌యం తెలిసిన కృష్ణ త‌ర్వాత‌.. సినిమాలో 25 ప‌ర్సంట్ త‌గ్గించుకుంటాన‌ని చెప్పారు. ఇక‌, అన్ని సినిమాల‌కు ముందుగానే రెమ్యున‌రేష‌న్ పూర్తిగా తీసుకునే శోభ‌న్‌బాబు.. ఈ సినిమాకు మాత్రం అడ్వాన్స్ తీసుకునిచేశారు. దీంతో న‌ష్టాలు వ‌చ్చాయి.. 10 ప‌ర్సంట్ త‌గ్గించుకోవాల‌ని నిర్మాత కోరారు. అయితే.. బాబు మాత్రం మీకు లాభాలాసొత్తే.. ఇస్తారా ఏమిటండి! అని గద్దించి మాట్లాడారు. దీంతో అప్పు చేసి మరీ నిర్మాత రెమ్యున‌రేష‌న్ చెల్లించారు.