అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ సినిమాల్లోకి వచ్చి ఎనిమిది ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కెరియర్లో సరైన హిట్ లేదు. వినాయక్ దర్శకత్వంలో చేసిన తొలి సినిమా అఖిల్ పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత వరుసగా హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి. తర్వాత గీతా బ్యానర్లో చేసిన సినిమా ఎలిజబుల్ బ్యాచిలర్ ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయింది. అది కూడా అఖిల్ రేంజ్కు తగ్గ సినిమా అయితే కాదు. ఆ సినిమాని హిట్ చేసేందుకు కూడా అందరూ తలో చేయి వేయడంతో పాటు ఎంతో కష్టపడ్డారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత కరోనా తోడు కావడంతో అఖిల్ తర్వాత సినిమా ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా గ్యాప్ వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఎంత ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. నిర్మాత అనిల్ సుంకరకు ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ కెరియర్ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది.
అఖిల్ కు అసలు ఏమాత్రం కథలు ఎంచుకునే సెన్స్ కూడా లేదనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యార్ అఖిల్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. ప్రభాస్ రాధేశ్యామ్, సాహో సినిమాలకు పనిచేసిన అనిల్ కుమార్ ను దర్శకుడు పరిచయం చేస్తూ ధీర అనే సినిమా నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఇది కూడా భారీ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
అసలే వరుస ప్లాపులతో ఉన్న అఖిల్ మరోసారి భారీ బడ్జెట్, పాన్ ఇండియా అంటూ పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అంటూ విమర్శలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అఖిల్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. దానిని వాడుకుంటూ లవ్ స్టోరీలతో సినిమాలు చేయకుండా అనవసరంగా భారీ బడ్జెట్ సినిమాలు, ఫాన్ ఇండియా సినిమాలు అంటూ మరోసారి రాంగ్ స్టెప్ వేస్తున్నాడని.. ఏది ఏమైనా అఖిల్కు సరైన హిట్టు లేదని అయినా తన బుద్ధి మార్చుకున్నట్టు కనపడటం లేదని… ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ?
యూవీ క్రియేషన్స్ కూడా చాలా తెలివిగా లవ్ స్టోరీతో సినిమా చేయకుండా భారీ బడ్జెట్ , పాన్ ఇండియా అంటూ లేనిపోని హంగామా చేస్తుందని.. వాస్తవానికి అఖిల్ కు అంత సీన్ లేదని కూడా ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.