పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ సీతగా నటించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజు రూ.140 కోట్లకు పైగా కలెక్షలను సాధించి హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూడో సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.
త్రిబుల్ ఆర్, బాహుబలి సినిమాల తర్వాత ఆదుపురుష్కు బాక్స్ ఆఫిస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా రెండో రోజు కలెక్షన్ వివరాలు కూడా మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. అలాగే ఈ సినిమా థియేటర్లో విడుదలైన తొలి రోజు నుంచే భారీ విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులు ఏమాత్రం మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపుతుంది. అయితే ఇదే సమయంలో మొదటి రోజు కంటే తక్కువ మొత్తంలోనే రెండో రోజు వసూళ్లు వచ్చాయి. తాజాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఆది పురుష్ సినిమాకు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది.
తొలిరోజు రూ.140 కోట్లు కలెక్షన్లు సాధించగా రెండో రోజు రూ.100 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లోనే మొత్తంగా రూ.250 కోట్లు పైగా గ్రాస్ కలెక్షలను దక్కించుకుంది. అలాగే వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లను బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాపై భారీ నెగటివ్ టాక్ రావడంతో రోజురోజుకు కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.271 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావాలంటే రూ.272 కోట్ల వరకు షేరే వసూల్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని లెక్కల ప్రకారం రెండో రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
ఏపీ మరియు నైజాం : రూ.75 కోట్లు
తమిళనాడు : రూ.2.20 కోట్లు
కేరళ : రూ.1.10 కోట్లు
కర్ణాటక : 14.32 కోట్లు
ఋఓఈ : క్ప్.90 కోట్లు
ఓవర్సీస్ : రూ.38 కోట్లు / 4.63 మిలియన్ డాలర్స్ గా వసూళ్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు.