యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మరి కొద్ది గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే నార్త్ టు సౌత్ ఆదిపురుష్ మానియా అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ ఆడియెన్స్ కూడా ఆదిపురుష్ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ బుకింగ్లు కూడా జోరందుకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ వండర్ రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక ఈ మహాకావ్యాన్ని బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఇండియన్ సినిమా జనాలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టిక్కెట్ల బుకింగ్ జోరు మామూలుగా లేదు.
నైజాంతో పాటు ఏపీలోనూ టిక్కెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి అనుమతులు కూడా వచ్చేశాయి. ఇక ఇప్పుడు అదనపు షోలు కూడా పడనున్నాయి. నైజాంలో అయితే రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచే ఫ్యాన్స్ షోలు వేయనున్నారు. ఇక ఏపీలో కూడా ఫ్యాన్స్కు బెనిఫిట్ షోలు అనేక ప్రాంతాల్లో వేయనున్నారు.
ఇప్పటికే ఫ్యాన్స్ షోల టిక్కెట్లు అమ్ముడు అయ్యే ప్రక్రియ అయితే ప్రారంభయయ్యింది. దీంతో జూన్ 16 న తెల్లవారు ఝామునుంచే ఆదిపురేష్ బెనిఫిట్ షోలు స్టార్ట్ కానున్నాయి.