కొన్ని కొన్ని ఘటనలు రాజకీయాలను ఆసక్తిగా మారుస్తాయి. ప్రజల్లో అంచనాలు పెంచేలా చేస్తే.. నాయ కుల అభిమానుల కళ్లలో ఆనందం పెరిగేలా చేస్తాయి. ఇక, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లను పరిగెట్టించేలా కూడా చేస్తాయి. ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో ఇదే జరిగిందని పబ్లిక్ టాక్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవి కుమార్ వరుస విజయాలు సాధిస్తున్నారు. పార్టీ ఏదైనా.. వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్కు ఎలాంటి ఇబ్బందీ లేదు.
అయితే.. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ను ఓడించేందుకు.. వైసీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తు న్నారనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే.. వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఇక్కడ పెద్దగా వర్కవుట్ కావడం లేదనే విషయం ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇదిలావుంటే.. తాజాగా ఇక్కడ టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు రవి నేల, నింగి అదిరిపోయేలా ఏర్పాట్లు చేశారు.
ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇసకేస్తే రాలదు.. అన్న మాట అద్దంకి నియో జకవర్గంలో సాగినయువగళం పాదయాత్ర నిజం చేసిందని పరిశీలకులు సైతం వ్యాఖ్యానించారు. వాస్తవానికి పార్టీ తరఫున ఏ కార్యక్రమం అయినా.. గొట్టిపాటి ఇదే రేంజ్లో స్పందిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ భవన్పై దాడి జరిగినప్పుడు కూడా.. 100 కార్లలో అభిమానులు తీసుకుని.. ఆయన ఇక్కడకు వచ్చారు. మహానాడుకు కూడా అదే రేంజ్ చూపించారు.
ఇక, స్వయంగా తన నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు. ఇప్పటి వరకు జరిగిన నియోజకవర్గాల్లో పాదయాత్ర కంటే .. పది రెట్లు ఎక్కువగా ప్రజలను ఆయన సమీకరించారు. ఈ పరిణామాలను గమనించిన తర్వాత.. ఆయన గెలుపు ఎలానూ ఖాయమనుకు న్న వారు.. మెజారిటీపై లెక్కలు వేసుకుంటున్నారట.
అంతేకాదు.. మరికొందరు అయితే వాళ్ల ముందు ఏ మీడియా ఛానెల్ గొట్టం కనపడినా కూడా రవికుమార్ గెలుపు కాదు… మెజారిటీపై పందేలు కట్టేందుకు కూడా రెడీ అంటున్నారు. ఇదీ.. గొట్టిపాటి రియల్ పాలిటిక్స్ అంటున్నారు ఆయన అభిమానులు.