ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరి నోట ఒకే మాట ఆది పురుష్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించగా.. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇదే సమయంలో గత రాత్రి ముంబైలో ఈ సినిమాను చిత్ర యూనిట్ కోసం స్పెషల్ షో ఏర్పాటు చేశారు.ఈ షో కి ఈ సినిమా యూనిట్ వారి కుటుంబాలతో కలిసి వీక్షించారు. ఇదే సమయంలో ఈ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ తన ఫ్యామిలీతో ఈ సినిమాను వీక్షించింది. కృతి సనన్ ఈ షో కి నెమలి రంగు అనార్కలి సూట్ లో అందరికంటే ఎంతో స్పెషల్ గా కనిపించింది.
ఇక కృతి తల్లితండ్రులు రాహుల్ సనన్, గీతా సనన్ కూడా సీత పాత్రలో తమ కూతురు నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని అక్కడ మీడియా మిత్రులకు వెల్లడించారు.ఇక అలాగే రాముడు గా ప్రభాస్ ఎంతో అద్భుతంగా నటించాడని, ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ రాముడిగా ప్రభాస్ ఏ గుర్తుండిపోతారని వారు అన్నారు.
అదిపురుష్ కోసం దేశవ్యాప్తంగా ఇంతమంది ఎదురుచూడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. ఇక ఆ తర్వాత కృతి సనన్తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఆమె ఎంతో ఓపికతో వారందరితో సెల్ఫీలు దిగింది. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో సిమా యూనిట్ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇక ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.