చిత్ర పరిశ్రమలో ఒక సినిమాతోనే భారీ స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్లందరూ ఒకసారి గా ఉన్నటువంటి సినిమాలకు దూరమవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో కమలిని ముఖర్జీ కూడా ఒకరు. ఈమె మొదటి సినిమా ఆనంద్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికి బుల్లితెరపై వస్తుంటే బోర్ కొట్టకుండా చూస్తూనే ఉంటారు.
ఆ సినిమాలో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, గ్లామర్ యాంగిల్ కుర్రకారును బాగా కట్టిపడేశాయి. అలాంటి ఫీల్ గుడ్ సినిమాతో పరిచయమైన కమలిని ముఖర్జీ మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఈ సినిమా తర్వాత అక్కినేని మనవడు సుమంత్ హీరోగా వచ్చిన గోదావరి సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది.
ఇక అలా వరుస అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసిన ఈమెకు తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా మలయాళం, తమిళం, బెంగాలీ సినిమాల్లో కూడా ఈమె నటించి మెప్పించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరివాడే సినిమాలో చివరగా కనిపించింది.
ఆ తర్వాత సినిమాలు దూరంగా ఉంది. ప్రస్తుతం బిజినెస్ వైపు దృష్టి సారించి అమెరికాలో స్థిరపడింది. ఇటీవల డల్లాస్ లో ఓ ఈవెంట్లో కమలిని ముఖర్జీ సందడి చేసింది. ఆ ఫోటోలు చూస్తుంటే కమలిని ముఖర్జీ వేనా అన్నట్టు ఎంతో బొద్దుగా తయారైంది. అసలు ఆనంద్, గోదావరి సినిమాల్లో కమలిని.. ఇప్పుడు కమలిని చూస్తుంటే అస్సలు గుర్తు పట్టలేకుండా ఉన్నాము.