సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తోన సంగతి తెలిసిందే. మహేష్బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చి అతడు, ఖలేజా రెండు కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఖలేజా తర్వాత 12 ఏళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని మరోసారి ఈ ఇద్దరు గుంటూరు కారం సినిమాతో జట్టుకట్టారు.
దీంతో సహజంగానే ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పూజ హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు కారం సినిమాలో నేను హీరోయిన్గా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి
తాజాగా ఓ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ… నేను మహేష్ బాబుకి వీరాభిమాని అని… ఈ సినిమాలో తన ఫస్ట్ డే.. ఫస్ట్ షాట్ మహేష్ బాబుతోనే జరిగిందని.. ఈ షాట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చింది. అలా మహేష్బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందో లేదో వెంటనే మహేష్ భజన మొదలు పెట్టేసింది.. మహేష్ను బుట్టలో వేసుకునేందుకు ఆమె మొదలు పెట్టేసిందని… మీనాక్షి మామూలు ముదురు కాదురో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కంటెంట్ని త్రివిక్రమ్ రెడీ చేశాడట. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతోంది. 2024, జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ కానుంది.