తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య ఉన్న బంధం పై రకరకాల పుకార్లు, షికార్లు ఉండేవి. వీరిద్దరి బంధం అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఎంజీఆర్ ను ఎంతో పిచ్చిపిచ్చిగా ప్రేమించడంతోపాటు ఆయన కోసం సర్వస్వం అర్పించేసిన జయలలిత అసలు శోభన్ బాబును ఎందుకు ? తగులుకుంది.. శోభన్ బాబుపై ఎందుకు మనసు పడింది అనేదానిపై రకరకాల పుకార్లు ఉండేవి.
అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉందట ఎంజీఆర్ స్వతహాగా అమ్మాయిల పిచ్చోడు. ఒక హీరోయిన్ తన పక్కన ఏకంగా ఐదు సంవత్సరాలు పాటు కంటిన్యూగా నటించాలని కాంట్రాక్టు రాయించుకునేవాడట. ఆ ఐదు సంవత్సరాల పాటు ఆ హీరోయిన్ కు ఇతర హీరోల సినిమాలలో నటించే అవకాశం వచ్చినా నటించకూడదు. అంత పక్కాగా ఎంజీఆర్ కండిషన్లు పెట్టేవారట.
మంజుల, లత లాంటి హీరోయిన్లు ఐదు సంవత్సరాలు పాటు తన సినిమాలలోనే నటించాలని కాంట్రాక్ట్ రాయించుకుని మరి వాళ్లతో సినిమాలు చేశాడన్న ప్రచారం ఉంది. వాళ్ళిద్దరితో చాలా అంటే చాలా సన్నిహితంగా ఉంటున్న క్రమంలోనే జయలలితకు కోపం వచ్చిందని.. తాను ఆ ముసలోడి కోసం సర్వస్వం అర్పిస్తున్నా తనను కాదని వేరే అమ్మాయిలతో ఉంటాడా ? అన్న కోపంతోనే ఆమె శోభన్ బాబు పై మనసు పడిందని కొందరు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ముసలోడు ఎంజీఆర్తో జయలలితకు బోర్ కొట్టడంతోనే అప్పుడు యంగ్గా, హ్యాండ్సమ్గా ఉన్న శోభన్బాబును బాగా ఇష్టపడిపోయిందట. శోభన్బాబు కూడా జయలలిత విషయంలో కేర్ తీసుకోవడంతో ఆమె అతడికి పడిపోయిందంటారు. ఎంజీఆర్ తనను కాదని ఇతర హీరోయిన్ల వైపు దృష్టి మరల్చడంతో జయలలిత ఆయన చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక తన అవసరాల కోసం శోభన్ బాబుని చేరదీసిందన్న ప్రచారం కూడా ఉంది.