నందమూరి అందగాడు బాలకృష్ణ ఇప్పటివరకు దాదాపు అన్ని జానర్లలో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. పలు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమా బాలకృష్ణను స్టార్ హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు, ఆ సినిమా దాదాపు 500 రెట్ల లాభాలు తెచ్చిపెట్టి అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది.
ఆ సినిమా మరేదో కాదు చాలామంది అభిమానులకు బాగా ఇష్టమైన “మంగమ్మగారి మనవడుష. ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి భారతీయ రాజా కథ అందించగా కోడి రామకృష్ణ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఇందులో టైటిల్ రోల్లో భానుమతి రామకృష్ణ నటించగా హీరో బాలకృష్ణ సరసన సుహాసిని చారుహాసన్ యాక్ట్ చేసింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.
ఈ సినిమాలో ‘దంచవే మేనత్త కూతురా’ అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. బాలకృష్ణ యాక్షన్ కూడా అందరి చేత చప్పట్లు కొట్టించింది. ఈ మూవీ మొత్తంగా హోల్సమ్ ఎంటర్టైనర్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 1984 రిలీజ్ అయిన ఈ సినిమాని ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించగా అతడు ఈ సినిమాతో ఒక్కసారిగా కోటీశ్వరుడు గా అవతరించాడు.
ఈ మూవీని ఆయన కేవలం లక్ష రూపాయలతో నిర్మించగా అది 4 కోట్ల 80 లక్షలు సంపాదించి పెట్టింది. ఆ రోజుల్లో లక్ష అంటేనే చాలా ఎక్కువ మొత్తం. అలాంటిది ఈ సినిమా దాదాపు ఐదు కోట్లు కలెక్ట్ చేయడంతో ఎస్ గోపాల్ రెడ్డి జాక్పాట్ కొట్టినట్లు అయింది. ఈ మూవీ చాలా థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడి అప్పటి రికార్డులన్నీ తిరగరాసింది.