ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరి నోట ఒకే మాట ఆది పురుష్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించగా.. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా నీన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమాల తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు.
ప్రభాస్ అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ సినిమా తొలి రోజు అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలిరోజు కలెక్షన్ లెక్కల ప్రకారం బాలీవుడ్ లో మాత్రం అదిరిపోయే రీతిలో రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా తర్వాత ఆది పురుష్ నార్త్ ఇండియాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టింది.
అలాగే ఈ సినిమా మిగిలిన ఇండస్ట్రీలో కూడా దాదాపు రూ.50 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా ఇండియాలోనే రూ.120 నుంచి రూ.140 కోట్లు రాబట్టింది. ఇది ప్రభాస్ కెరియర్ లోనే ఓ అరుదైన రికార్డు. ఈరోజు రేపు వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అడ్వాన్స్ బుకింగ్ పరంగా కూడా ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్వైడ్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ సినిమా రూ.150 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. టాలీవుడ్ లెక్కల విషయానికి వస్తే తొలిరోజు నైజాం రూ.50 కోట్లు, విశాఖపట్నం రూ. 12.5 కోట్లు, ఈస్ట్ రూ. 8 కోట్లు, వెస్ట్ రూ. 7 కోట్లు, కృష్ణా రూ. 7.5 కోట్లు, గుంటూరు రూ. 9 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు, సీడెడ్ రూ. 17.5 కోట్లు రాబట్టింది.
ఇక నైజాం, ఏపీతో కలిపితే ఆదిపురుష్ తొలిరోజు 115.5 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇంకా బాలీవుడ్లో రూ.72 కోట్లు, కర్ణాటకలో రూ.12.5 కోట్లు, వివిధ రాష్ట్రాల్లో రూ.4.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్లో తొలిరోజు రూ.30 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని అంచనా. ఇంకా అధికార లెక్కలు మాత్రం రావాల్సి ఉంది.