కొన్ని సినిమాలను మనం ఎన్నిసార్లు చూసినా ఎప్పటికీ మర్చిపోలేము.. అలాంటి గోల్డెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన సినిమా మన్మధుడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా నాగార్జున కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. రైటర్ త్రివిక్రమ్ ఈ సినిమాతో తనలోని విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాకు ఆయన రాసిన ప్రతి డైలాగ్ సూపర్ పంచ్లా పేలింది.
ఇక అప్పట్లో త్రివిక్రమ్ సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్ దగ్గర రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. అదే సమయంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. ఎప్పుడైతే త్రివిక్రమ్, విజయ భాస్కర్ దగ్గర నుంచి బయటకొచ్చి సొంతంగా సినిమాలు చేయడం ప్రారంభించాడో… అప్పటి నుంచి విజయభాస్కర్ కి బ్యాడ్ టైం మొదలైంది.
మన్మధుడు విషయానికొస్తే ఆ టైంలో ఈ సినిమా సుమారు రూ.14 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. ఈ సినిమాని ముందుగా నాగార్జునతో కాకుండా మరో యంగ్ హీరో తరుణ్ తో చేయాలని అనుకున్నారట. అదే సమయంలో తరుణ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయాడు. సినిమా తరుణ్ కి బాగా సెట్ అవుతుందని విజయ్భాస్కర్ భావించారు.
అప్పట్లో తరుణ్ కామెడీ టైం పర్ఫెక్ట్ గా ఉండేది. త్రివిక్రమ్ మన్మధుడు సినిమాని తరుణ్ తో చేయలేకపోయినా ఆయన మొదటి సినిమా నువ్వే నువ్వేలో తరుణ్ హీరోగా చేశాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్. తరుణ్ మన్మధుడు సినిమా చేసి ఉంటే కచ్చితంగా ఆయన కెరీర్ మరో లెవెల్ లో ఉండేదని సినీ వర్గాలు భావించాయి. ఈ చిన్న రాంగ్ స్టెప్ తరుణ్కు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే మన్మధుడు సినిమా చూశాక ఆ సినిమాలో నాగార్జునను తప్పా మరెవ్వరిని ఊహించుకోలేం.