నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ దండయాత్ర వీరసింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం తన 108వ సినిమా ‘భగవంత్ కేసరి’ను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఇక రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. ఆ టీజర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్యను కూడా కొత్త లుక్ లో చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాని కూడా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమాతో హ్యాట్రిక్ విజయంపై కన్నేసాడు బాలయ్య. ఈ సినిమా తర్వాత బాలయ్య తన 109వ సినిమాను మెగా దర్శకుడు బాబీతో చేస్తున్నడు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ అలాగే ఫార్చ్యూన్ పోర్ బ్యానర్ పై త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించునున్నాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించబోతున్నట్లు పలు వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ నయనతారను ఒప్పించారని కూడా టాక్ వినబడుతుంది. గతంలో కూడా బాలకృష్ణ, నయన్ కాంబోలో సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా వంటి పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా నయనతార హీరోయిన్గా కన్ఫర్మ్ అయితే నాలుగో సినిమా కానుంది. బాలయ్య నయనతార ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్లతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.