మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రవితేజ నటించిన సినిమాల్లో భద్ర ఒకటి. ఈ సినిమా ద్వారా రవితేజకు బాగా గుర్తింపు వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా, బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించింది. సునీల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. క్లాస్ హీరోలనైనా మాస్ గా చూపించడంలో బోయపాటికి మంచి క్రేజ్ ఉంది. బోయపాటి దర్శకత్వం వహించిన సినిమాల్లో భద్ర, సింహా, లెజెండ్, అఖండ, తులసి ఇలా ఎన్నో మాస్ సినిమాలు హిట్లుగా నిలిచాయి.
అయితే ఈ సినిమా ఫ్రాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా అని అందరికీ తెలిసిన విషయమే. దీనిలో రవితేజకి ఫ్రెండ్ గా మీరా జాస్మిన్ కు అన్నయ్యగా దీపక్ నటించారు. ఈ సినిమాలో దీపక్ రాజా రోల్ న్యాచురల్ గా నటించారు. అయితే ఈ సినిమాలో మధ్యలో విలన్స్ తో ఫైట్ చేస్తు దీపక్ రవితేజ చేతిలో చనిపోతాడు. ఈ ఎమోషనల్ సీన్ చాలా బాగా పండింది.
సినిమాలో రవితేజ దీపక్ కలిసి చేసిన కామెడీ కు బాగా క్రేజ్ వచ్చింది. దీని ద్వారా దీపక్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ముందుగా దీపక్ బదులుగా రాజా పాత్రలో నటించడానికి రాజీవ్ కనకాల అయితే బాగా సెట్ అవుతాడు అనుకున్నారట బోయపాటి. కాని రాజీవ్ కనకాలకు ఆ సమయంలో డేట్స్ ఖాళీ లేకపోవడంతో నో చెప్పాడట. దీంతో వేరే ఆప్షన్ లేకపోవడంతో హీరో శివాజీని కన్సల్ట్ అయ్యాడట బోయపాటి. శివాజీకి కూడా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల దీపక్ ను కలిశారట.
అప్పటికే సంపంగి, నీ తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన దీపక్.. భద్ర సినిమాలో కథతో పాటు తన క్యారెక్టర్ నచ్చడంతో ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీపక్ ఆ తర్వాత కూడా కింగ్, మిత్రుడు, అరుంధతి లాంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం అందరికీ తెలుసు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన దీపక్ ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.