అంతకుముందు.. ఆ తర్వాత సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మూవీస్ నామినేషన్లో సెలెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా ఈషా ఓయ్, అమితుమీ, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా చాలా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈషాకి ఈ సినిమాల తో మంచి పేరు వచ్చినా కెరియర్ ముందుకు వెళ్లడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో వచ్చినా అవకాశాల్లో నటిస్తూ ముందుకు సాగుతుంది. తెలుగు హీరోయిన్ కావడమే అందుకు కారణం అని చాలా సందర్భాల్లో ఆమె చెప్పింది. అయితే ఈషా తన అభిమానులకు హాట్ ఫోటోషూట్ తో కన్నుల విందు చేసేందుకు ఎప్పుడు ముందే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈషా.. ప్రస్తుతం డ్యూటీ మిర్రర్ సెల్ఫీలతో మెరుస్తుంది.
ఇందులో ఆమె థైస్ కనిపించేలా పొట్టి నిక్కర్ వేసుకొని స్టైల్ గా పోజులిస్తూ, కన్ను కొడుతోంది. చిలిపి స్టిల్స్ తో సెల్ఫీస్ తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఎంతోమంది హీరోయిన్లు తమ హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్నా… వాటికి తగ్గకుండా ఈషా అందచందాలు చూపిస్తోంది. ఈషా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ నేను ఒక్కడినే.. నేను నా ప్రతిబింబం అంటూ ట్యాగ్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. చాలామంది నెటిజన్లు గార్జియస్, బ్యూటిఫుల్ అంటూ ఆ పోస్ట్ కు స్పందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈషా మాయామశ్చీంద్ర సినిమాలో హీరోయిన్గా సుధీర్ బాబుతో నటిస్తోంది. ఈ సినిమా అయినా ఈషా తలరాత మారుస్తుందేమో ? చూడాలి.