తెలుగు సినీ ప్రపంచంలో కళాభినేత్రి వాణిశ్రీ తర్వాత.. అంతటి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అనేక పాత్రల్లో మెప్పించారు. అప్పటి సంప్రదాయ సినిమాల నుంచి మధ్యలో వచ్చిన.. ఎక్స్పోజింగ్ పాత్రల వరకు.. తర్వాత.. వచ్చిన క్యారెక్టర్ పాత్రల వరకు కూడా.. జయసుధ తన సత్తా చాటుకున్నారు. సినిమాల్లో అరంగేట్రం కూడా.. అత్యంత సునాయాసంగా జరిగిపోయింది.
సినిమాలపై ఆది నుంచి కూడా జయసుధకు ఒక అవగాహనలేదు. అయితే, ఆమె తల్లికి మాత్రం ఇష్టం ఉండేది. ఇలా.. ఒకసారి.. సినిమా షూటింగుల కోసం.. వచ్చిన విజయనిర్మల సావాసంతో జయసుధ అరంగేట్రం చేశారు. అయితే, తర్వాత ఎవరి దారివారిది అనేలా దూసుకుపోయారు. సినిమా డైరెక్టర్గా అవకాశం వచ్చినా జయసుధ సున్నితంగా తిరస్కరించారు. అయితే.. సహ నిర్మాతగా మాత్రం వ్యవహరించారు.
ప్రతి రూపాయినీ జాగ్రత్త చేసుకున్న హీరోయిన్లలో జయసుధ ఒకరు. అయితే.. తొలినాళ్లలో జయసుధను చూసిన వారు.. పొట్టిగా ఉన్నారు.. నువ్వు ఏం చేస్తావ్ అని ఈసడించుకున్నారు. అయితే.. దీనిని కసిగా తీసుకున్న జయసుధ వచ్చిన ప్రతిపాత్రకూ న్యాయం చేసేందుకుప్రయత్నించి.. సక్సెస్ అయ్యారు. దాసరి నారాయణరావు పరిచయం అయ్యాక.. అన్నగారు ఎన్టీఆర్తో కలిసి నటించడం.. మొదలు పెట్టాక.. జయసుధ సినీ జీవితం మారిపోయింది.
వద్దని అన్నవారే.. కాదని చెప్పిన వారే.. కాల్ షీట్ల కోసం.. ఎదురు చూశారు. అయితే.. జయసుధ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరితోనూ దురుసుగా మాట్లాడింది కూడా లేదు. అప్పుడున్న పరిస్థితిలో వారు అలా అని ఉంటారని సరిపెట్టుకున్నారు. అంతేకాదు.. ఎవరూ నొచ్చుకునేలా కూడా జయసుధ వ్యవహరించకపోవడం గమనార్హం. దటీజ్ జయసుధ. అందుకే.. ఇప్పటికీ వివాదరహిత నటీమణిగా.. సావిత్రి తర్వాత.. సావిత్రిగా పేరు తెచ్చుకుంది.