తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాల గురించి..హైదరాబాద్ సహా ఇతర కీలక ప్రాంతాల్లో జరుగుతున్న కీల క చర్చల్లో చంద్రబాబు, టీడీపీల గురించి ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలుస్తుందన్న విషయంపై మేధావులు సైతం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబా బు అలా కూర్చుంటే చాలు.. రెండు మూడు వర్గాలు ఆయన ఎలాంటి ప్రచారం చేయకపోయినా.. గెలిపి స్తాయని అంటున్నారు.
1) ముఖ్యమంత్రి:
సీఎం జగన్ స్వయంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన చేస్తున్న సంక్షేమం, సలహాదారుల నియామకం.. వంటివిషయాలు.. పార్టీపై వ్యతిరేకతను పెంచుతున్నాయన్నది మేధావుల ఆలోచనగా ఉంది. ఇది చంద్రబాబును గెలిపిస్తాయని అంటున్నారు. మెజారిటీ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు. అదే సమయంలో సలహాదారుల రూపంలో ప్రజల సంపదను జీతాల రూపంలో వారికి ఇవ్వడాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అనుభవం లేదని నిరూపితమైందనే వారు కూడా ఉన్నారు.
2) ఉద్యోగులు:
చంద్రబాబు హయాంలో కనీసం తమకు 1వ తారీకునే జీతాలు అందాయని అంటున్న ఉద్యోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏదో చేస్తాడని.. సీఎం జగన్పై వారు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు సహా.. ఇతర అంశాలపై వారు ఎంతో ఎదురు చూశారు. అయితే.. ఈ నాలుగేళ్లలో కనీసం తమకు జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదనే ఆవేదన ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాలు పూర్తిగా ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్నాయి. ఇది టీడీపీ కలిసి వచ్చిన అవకాశంగా మేధావులు అభిప్రాయపడుతున్నారు.
3) రెడ్డి సామాజికవర్గం:
ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. జగన్ను తమ నాయకుడిగా భావించిన రెడ్డి సామాజిక వర్గం.. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తారా? అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా వ్యతిరేకత వస్తే.. దానిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, కీలకమైన రెడ్డి వర్గంలోనే ఇప్పుడు భారీ చీలిక వచ్చిందని మేదావులు చెబుతున్నారు. ఇది ప్రత్యక్షంగా జగన్ను మైనస్ చేస్తుండగా..చంద్రబాబుకు కలిసి వచ్చేలా చేస్తోందని చెబుతున్నారు.