వైద్య శాఖ మంత్రి విడదల రజనీ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రజలు ఇప్పుడు టీడీపీవైపు చూస్తున్నారని అంటున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు సైలెంట్ ప్రచారం.. టీడీపీ పుంజుకున్న నేపథ్యంలో ఇక్కడిప్రజలు కూడా అటువైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బలమైన నాయకుడిగా ఉన్న మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ.. విడదల రజనీ వ్యవహారం మాత్రం గెలుపు-ఓటముల మధ్య ఊగిస లాటగానే ఉందని చెబుతున్నారు.
హోంశాఖ మంత్రి తానేటి వనిత ఈ సారి ఖచ్చితంగా ఓటమిని చవి చూడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కొవ్వూరులో ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన సర్వేలో వనితకు వ్యతిరేకంగా 70 శాతం మంది స్పందించారు. పైగా..టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో వనిత గెలుపు చాలా చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే ఈ సారి ఆమెను పక్కనే ఉన్న గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని కూడా అంటున్నారు.
మరో మంత్రి .. ఉష శ్రీచరణ్.. ఈసారి విజయం దక్కించుకోవడం కష్టమని అంటున్నారు. కళ్యాణదుర్గం లో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మంత్రిగారు అందుబాటులో ఉండడం లేదని 70 శాతం మంది చెప్పారు. ఉన్నా పనులు చేయడం లేదని 50 శాతం మంది చెప్పారు. అసలు మంత్రి అయ్యాక ఆమె కనిపించడం మానేశారని.. అనేవారు ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి మహిళా మంత్రుల్లో ఓడిపోయే తొలిపేరు ఈమెదే కావడం గమనార్హం.