మహేష్ కోసం మొత్తం స్క్రిప్ట్‌ మార్చేస్తున్న త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు త్రివిక్రమ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టబోతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. త్రివిక్రమ్ చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్తో మహేష్ బాబుని ఒప్పించలేదనేది టాలీవుడ్‌లో బహిరంగ రహస్యం. త్రివిక్రమ్ తన సమయాన్ని వెచ్చించి స్క్రిప్ట్‌పై పని చేసాడు అంతే కాకుండా మహేష్ బాబు తన యూరోపియన్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మహేష్‌కి వివరించాడు. త్రివిక్రమ్ నుండి బలమైన ఎమోషనల్ డ్రామాతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మహేష్ ఎక్ష్పెక్త్ చేసేవాడు, ఇది రచయితగా మారిన దర్శకుడి త్రివిక్రమ్కి ప్రధాన బలం. రాజమౌళి దర్శకత్వం వహించే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం మహేష్ పని చేయాల్సి ఉంటుంది.దానికి ముందు మహేష్ త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ డ్రామాని కోరుకున్నాడు.

త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్కి పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌ను వివరించాడు, ఇందులో భావోద్వేగాలు మరియు వినోదం ఎక్కువగా ఉంటాయి. మొదటి షెడ్యూల్లో మహేష్ పూర్తిగా ఒప్పికుని ఎటువంటి మార్పులను సూచించలేదు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 10 నుండి ప్లాన్ చేయబడింది కానీ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం కారణంగా వాయిదా పడింది. నటీనటులలో మార్పులు జరగనున్నాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ వాటిని ఖరారు చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా 2023లో చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు.

Tags: director trivikram, MaheshBabu, telugu news, tollywood news