మహేష్ బాబుతో పాటు అతని కుటుంబం గత సంవత్సర కాలంగా చాలా కష్టాలు అనుభవించారు.ఇప్పుడు వారు తమ కుటుంబానికి చెందిన పెద్ద దిక్కైన కృష్ణ గారిని కోల్పోయారు. నిన్నటి నుంచి చాలా మంది స్టార్స్ వచ్చి నివాళులర్పిస్తున్నారు.
వారిలో బాలకృష్ణ ఒకరు. అతను ఈ రోజు అంత్యక్రియలలో కనిపించాడు.కొద్దిసేపటికే ఒక ఫోటో వైరల్గా మారింది. తండ్రీకొడుకులకు బాలయ్య మంచి మాటలు చెప్పినప్పుడు మహేష్,అతని కుమారుడు గౌతమ్ చిరునవ్వు పంచుకున్నట్లు ఫోటోలో కనబడుతుంది.
ఈ ఫోటో కొద్ది సేపటికే వైరల్గా మారి అభిమానులను ఆనందపరిచింది. మహేష్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కష్టకాలంలో అతని ముఖంలో చిరునవ్వు కనిపించడం విశేషం.