టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జగజ్జేయమానంగా సాగిస్తున్న యువగళం పాదయా త్రకు ప్రజలు జననీరాజనం పలుకుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఎదురేగి మరీ స్వాగతాలు పలుకుతు న్నారు. మహిళలు హారతులు పట్టి యువ నాయకుడికి కన్నుదిష్టి తొలగి పోవాలంటూ.. ఎర్రనీళ్లతో దిష్టి తీస్తున్నారు. పురుషులు.. జేజేలు పలుకుతూ.. రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారు.
ఇంత అప్రతిహతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర, ఇంతింతితై అన్నట్టుగా రికార్డుల దిశగా ముం దుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర వైసీపీకి ఎంత నష్టం కలిగిస్తున్నదనే చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. దీనిలో టీడీపీ అనుకూల, వైసీపీ అనుకూల మీడియా వర్గాల వాదనను పక్కన పెడి తే.. తటస్థంగా ఉండే మధ్యతరగతి వర్గాల మాట కీలకంగా మారింది. “యువగళానికి వస్తున్న ఆదరణ ను ఊహించలేదు“ అని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
మరికొందరు.. యువగళంలో మహిళా శక్తి సహా.. భవిష్యత్తు భరోసా మేనిఫెస్టోను వివరిస్తున్నతీరును.. దాని వల్ల మహిళలకు, యువతకు జరిగే మేలును వివరించడం చాలా బాగుందని చెబుతున్నారు. ఇంకొంద రు.. యువతలో కూడా యువగళం బలమైన ముద్ర వేస్తోందని.. టీడీపీ వస్తే.. కొంత మార్పు ఖాయమనే దిశగా వారు ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో వైసీపీకి కంచుకోటల వంటి కర్నూలు, కడప జిల్లాల్లో ఆదరణ తర్వాత.. ఉమ్మడి నెల్లూరులోనూ యాత్ర దిగ్విజయంగా సాగుతుండడం వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అంటున్నారు. ఇక, రాజకీయ విశ్లేషకులు, మీడియా విశ్లేషకులు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. “అప్పట్లో జగన్కు ఇంత ఆదరణ వుందని.. అంత ఆదరణ ఉందని చెప్పుకొన్నారు.
ఇవన్నీ ఒక రికార్డుగా మారాయి. అయితే.. రాబోయే రోజుల్లో పాదయాత్ర జరిగే ప్రాంతాలను తీసుకుంటే.. దాదాపు అన్నీ కూడా టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లోనే సాగనుంది. కాబట్టి జగన్ రికార్డులు తుడిపేసినా.. ఆశ్చర్యం లేదు“ అని ప్రముఖ విశ్లేషకులు.. రవి అభిప్రాయపడ్డారు. ఇదీ.. సంగతి..!