వివి వినాయక్ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన సినిమా ఆది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను ఊహించని మలుపు తిప్పిన ఈ సినిమా 2002 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా అప్పటి వరకు రిలీజైన అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డును సృష్టించింది. అంతే కాకుండా 98 కేంద్రాల్లో 100 రోజులు పాటు ఆడిన సినిమాగా సంచలన రికార్డును ఖాతాలో వేసుకుంది.
అప్పటివరకు ఎన్నో సినిమాలుకు కో డైరెక్టర్ గా వ్యవహరించిన వివి వినాయక్ ఆది సినిమాతో డైరెక్టర్గా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఈవి వి సత్యనారాయణ, సాగర్, క్రాంతి కుమార్ లాంటి ఎంతో మంది సీనియర్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకుడుగా మారి ఒక కథ రెడీ చేసుకున్న వినాయక్ నల్లమలుపు శ్రీనివాస్ ( బుజ్జి ) బ్యానర్లో సినిమా తెరకెక్కించడానికి డిసైడ్ అయ్యాడు. ఈ సినిమాను మొదట్లో వివి వినాయక్ బాలకృష్ణ తో తెరకెక్కించాలనుకున్నాడట.
అయితే బాలకృష్ణ కోసం వినాయక్ అనుకున్న కథలో ఇద్దరు బాలకృష్ణలు ఉంటారట అందులో బాలకృష్ణ తమ్ముడు చిన్నప్పుడు విలన్ పై బాంబులు విసురుతాడు. ఆ తర్వాత పెద్ద బాలకృష్ణ పోలీసై అనుకోకుండా తన తమ్ముడిని కొట్టాల్సి వస్తుంది. ఆ కథలో టాటా సుమోలు గాల్లోకి ఎగిరే సన్నివేశం బాలకృష్ణ కోసమే వినాయక్ రాసాడట. అనూహ్యంగా ఈ సినిమాను ఎన్టీఆర్ తో రూపొందించాల్సి వచ్చింది.
దాంతో ముందుగా బాలయ్య కోసం రాసుకున్న కథలోని చిన్న చిన్న మార్పులను చేసి చిన్నపిల్లాడు విలన్లపై పరిగెత్తుకుంటూ బాంబులు విసిరే సీన్… టాటా సుమోలు గాల్లోకి ఎగిరే సీన్ ఆది సినిమా కోసం .
వాడుకున్నాడట వినాయక్. అలా బాలకృష్ణ నటించాల్సిన సినిమాల్లో ఎన్టీఆర్ నటించి హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత వినాయక్ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందించిన ఆది పాటలు ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి. కీర్తిచావ్లా ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించింది.