జాక్పాట్ ఆఫర్ కొట్టిన బేబీ హీరోయిన్‌.. పాన్ ఇండియా డైరెక్టర్ తో వైష్ణవి సెకండ్ మూవీ..!!

బేబీ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయింది వైష్ణవి చైతన్య. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ఈ బ్యూటీ ఓ పక్క సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ లేక హీరోయిన్లు అలాడిపోతుంటే ఈ బ్యూటీ మాత్రం మొదటి సినిమాతోనే హిట్ కొట్టి వరుసగా క్రేజీ ఆఫర్స్ ని అందుకునే పనిలో బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఆమె చేసింది ఒకటే సినిమా అయినా వెబ్ సిరీస్ లో చేసిన కానీ అమ్మడుకు అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. కానీ మొదటి సినిమానే హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయినా వైష్ణవి రెండవ సినిమాకే పాన్ ఇండియా డైరెక్టర్ తో అవకాశాన్ని కొట్టేసింది.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమాకు కమిట్ అయ్యింది వైష్ణవి. త్వరలోనే టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందబోతున్న ఇస్మార్ట్ డబుల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అన్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశాడు రామ్ పోతినేని. బేబీ సినిమా హిటైన‌ తర్వాత పెద్ద ఫ్లవర్ బొకే ను వైష్ణవి చైతన్యకు పంపాడు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇలాంటి క్రమంలో వైష్ణవి చైతన్య సెకండ్ సినిమానే పాన్ ఇండియా డైరెక్టర్ తో చేసే బంపర్ ఆఫర్ ని కొట్టేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ పోతినేని తో అదిరిపోయే రేంజ్ లో డాన్స్ స్టెప్పులు వేయబోతుందట ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి మొదటి సినిమాతోనే తన పూర్తి తలరాతను మార్చేసుకుంది వైష్ణవి. ప్రస్తుతం ఇస్మార్ట్ డబుల్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకున్న వైష్ణవి ఈ సినిమా తరువాత తన మూడవ సినిమా అల్లు శిరీష్ తో చేయడానికి సైన్ చేసిందట. అసలు లెక్క ప్రకారం అల్లు శిరీష్ తోనే సెకండ్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఇస్మార్ట్ డబుల్ సెట్స్‌ పైకి రావడంతో ఆ సినిమాలో నటించాల్సి వస్తుంది. వైష్ణవి తన సెకండ్ సినిమాతో ఎలాంటి టాక్ తన ఖాతాలో వేసుకోబోతుందో చూడాలి.