ఒకే స్టోరీతో వ‌చ్చిన నాగార్జున – రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమాలు ఇవే…!

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఎన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకే స్టోరీతో ఎన్నో సినిమాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. కొన్ని సినిమాలు అచ్చుగుద్దిన‌ట్లు ఒకే క‌థ‌తో వ‌చ్చ‌న‌ కూడా వాటిని జనం గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. అలా సినీ ఇండస్ట్రీలో కథల కొరత ఉండడం వల్ల పాత కథల చుట్టూనే రకరకాల పాత్రలు క్రియేట్ చేసి సినిమాలు రూపొందించడానికి తెగ ట్రై చేస్తున్నారు దర్శకులు. కానీ ఒక్కోసారి దొరికిపోతుంటారు. అలా ఇంచుమించు ఒకే కథతో వ‌చ్చిన‌ రెండు సినిమాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.

వివాహ భోజనంబు :
కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తమిళ్ హీరోయిన్‌ అశ్విని హీరోయిన్‌గా నటించిన సినిమా వివాహ భోజనంబు. ఈ సినిమా 1988లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ అమ్మాయిలను ద్వేషించే పాత్రలో నటించాడు. ఈ సినిమా అప్పట్లో యావరేజ్ టాక్ దక్కించుకుంది.

మన్మధుడు :
త్రివిక్రమ్ కథతో దర్శకుడు కే.విజయభాస్కర్ రూపొందించిన సినిమా మన్మధుడు. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా ఈ సినిమా నిలిచిపోయింది. అషు, సోనాలి బింద్రే హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో నాగార్జున అమ్మాయిలను ద్వేషించే పాత్రను పోషించాడు. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇలా ఒకే కథతో వచ్చిన ఈ రెండు సినిమాలు గురించి ఈ తరం ప్రేక్షకులకు చాలామందికి తెలియదు. ఇలా ఎన్నో సినిమాలు ఒకే కథతో వ‌చ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతున్నాయి.