టాలీవుడ్ కి సంబందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. దిల్ రాజు ప్యానెల్, అటు సీనియర్ నిర్మాత సీ కళ్యాణ్ ఫ్యానెల్ రెండూ హోరాహోరీగా ప్రచారం చేశాయి. గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే దాదాపు వన్సైడ్గా జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్షుడు గా దిల్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు. ఇక కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 48 ఓట్ల లో నిర్మాత దిల్రాజు కి 31 ఓట్లు రావడంతో ఆయన గెలుపు వన్సైడ్ అయ్యింది. ఇక ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ శివలంక ప్రసాద్ – డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ ఛైర్మన్ మిక్కిలినేని సుధాకర్ – జాయింట్ సెక్రటరీ భరత్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ బోర్డు కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది.