పిల్లల అక్రమ రవాణాలో ఏపీ టాప్ ప్లేస్‌… దారుణ నిజాలు…!

‘భారత్ చిన్నారుల అక్రమ రవాణా’ పేరుతో గేమ్స్ 24X7 అనే స్వచ్ఛంద సంస్థ ఓ నివేదిక విడుద‌ల చేసింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్ధి స్థాపించిన కేఎస్సీఎఫ్ సహకారంతో అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స‌ద‌రు సంస్థ ఆదివారం ఈ నివేదిక‌ విడుదల చేసింది. పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి కేఎస్ సీఎఫ్ తోపాటు దాని అనుబంధ సంస్థల వద్ద 2016 నుంచి 2022వరకు ఉన్న సమాచారాన్ని గేమ్స్ 24×7 సేకరించి ప్ర‌చురించ‌డం విశేషం.

అయితే ఇందులో తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ టాప్‌-3 ప్లేసులో ఉండ‌డం విచార‌క‌రం. మొత్తం 21 రాష్ట్రాల్లో బిహార్ ఆరేళ్ల కాలంలో మొత్తం 4245 కేసులు వెలుగు చూడగా.. యూపీలో 3836 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 734 కేసులకు నమోదు కాగా.. వాటిలో గుంటూరు (208), నెల్లూరు (125), శ్రీకాకుళం (98), కర్నూలు (74), భీమవరం (28)లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంద‌ని స‌ద‌రు నివేదిక స్ప‌ష్టం చేసింది.