మొత్తానికి పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. జస్ట్ ఓకే పర్లేదు అంటున్నారు. పవన్, మెగా అభిమానులు మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కామన్ ఆడియెన్స్కు మాత్రం బ్రో బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. అయితే సినిమా చూసిన కొందరు నెటిజన్లు బ్రో సినిమాపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మంచి విష్ణు – నాగార్జున కలిసి నటించిన కృష్ణార్జున సినిమా నుంచి చాలా సీన్లు కాపీ కొట్టి బ్రో సినిమా తీశారని విమర్శలు చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్, మూవీలో చాలా డైలాగులు జీవితం, కాలం, కర్మ గురించి నాగార్జున కృష్ణార్జున సినిమాలో చెప్పినవే ఇక్కడ వాడేసారని ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు. బ్రో సినిమాలో జీవితం, టైం గురించి నాగార్జున మంచి విష్ణుకు ఉపదేశించే సీన్లు స్క్రీన్ షాట్లు పెట్టి మరి బ్రో సినిమాతో పోలుస్తున్నారు.
మంచి విష్ణు, నాగార్జున ఎలా ? యాక్ట్ చేశారో సేమ్ టు సేమ్ బ్రో సినిమాలోనూ పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కూడా అలాగే కలిసి నటించారని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాలం, కర్మ గురించి చాలా డైలాగులు కృష్ణార్జున సినిమాలో డైలాగులను కాపీ కొట్టి బ్రోలో వాడినట్టుగా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలిసి డ్యాన్సులు చేయడం కూడా కృష్ణార్జున సినిమాలో మంచు విష్ణు – నాగార్జున కలిసి డ్యాన్స్ చేసినట్టుగానే ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా బ్రో మిక్స్డ్ టాక్ తో కూడా ఏపీ, తెలంగాణలో రెండు రోజుల్లో 50 కోట్ల షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అటు ఓవర్సీస్ లోను ఇప్పటికే మిలియన్ మార్క్ డాలర్లను క్రాస్ చేసింది.