యాంకర్ ఉదయభాను.. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో నటించిన ఉదయభాను తర్వాత బుల్లితెర యాంకర్ గా స్థిరపడింది. ఒకప్పుడు టాలీవుడ్ బుల్లితెర ఫిమేల్ యాంకర్స్లో సుమ, ఝాన్సీ కి మంచి కాంపిటేటర్ గా ఉదయభాను కూడా ఉండేది. అలా బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన షోలకి యాంకర్ గా వ్యవహరించిన ఉదయభాను తరువాత మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది.
బుల్లితెరకు దూరమైన ఉదయభాను కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ప్రశ్నించే గొంతులను తొక్కిపడేస్తారని.. అలా తొక్కేసిన వారిలో నేను కూడా ఒకరిని అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా తనపై కుట్ర చేశారని తనని అణగతొక్కేసారని చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను గత 5 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు.. నేను కనిపించకపోయిన మీరు మాత్రం నన్ను గుర్తు పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉదయభాను కెరీర్ పై కొందరు కావాలనే కుట్ర చేశారంటూ ఈమె మాట్లాడింది.
ఈమె చేసిన కామెంట్స్ని బట్టి స్పష్టంగా ఉదయభాను ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి ఎవరో కుట్ర చేశారని అర్ధమోతుంది. ఎవరా వ్యక్తులు అన్న దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఉదయభాను ప్రస్తుతం అడపాదప సినిమా ఈవెంట్లలో యాంకర్ గా వ్యవహరిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పర్సనల్ లైఫ్ అప్డేట్స్ను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.