ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల ఎంతో మంచి స్నేహితులు. అయితే ఈ ఇద్దరి మధ్య స్నేహం ముందు గొడవలతో మొదలైందట. అదే తర్వాత ఫ్రెండ్షిప్ గా మారిందట. ఇంతకీ వారిద్దరి మధ్య పరిచయం ఎలా? మొదలైంది.. గొడవ ఎందుకు? వచ్చింది ఒకసారి చూద్దాం. ఇటీవల రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిన్ను చూడాలని ఉంది సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ నన్ను డబ్బింగ్ చెప్పమన్నారని.. ఎన్టీఆర్కి నా వాయిస్ సెట్ కాదని నేను వెనక్కి వచ్చేస్తే.. ఎన్టీఆర్ తన క్యారెక్టర్ కు డబ్బింగ్ తానే చెప్పుకున్నాడని గుర్తు చేసుకున్నాడు.
మేమిద్దరం మొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ 1 సెట్ లో కలిసామని.. కలిసిన మొదటి రోజు మధ్యాహ్నానికే ఎన్టీఆర్ నామీద కామెంట్స్ చేశాడని రాజీవ్ వివరించాడు. నాకు మంచి స్నేహితుడు చంద్రశేఖర్ నుంచి అతడి కళ్ళజోడు బాగుందని.. నా పాత్రకు బాగా సెట్ అవుతుందని అతడి దగ్గర నుంచి తీసుకుని పెట్టుకున్నానని.. షూటింగ్ జరుగుతుండగా ఇది అవసరమా..? అని నాపై ఎన్టీఆర్ కామెంట్స్ చేశాడని రాజీవ్ వివరించాడు.
నాకు కోపం వచ్చి రాజమౌళి దగ్గరికి వెళ్లి చెప్పానని.. ఇప్పుడు కామెంట్ చేశాడు, రేపు పొద్దున్నే నన్ను ఇంకోటి ఏదో అంటాడు నేను కౌంటర్ వేస్తాను. తిరిగి అందరూ నన్నే అంటారు.. నేను సినిమాలో నుంచి వెళ్ళిపోతాను అన్నాను అని చెప్పాడు. దీంతో రాజమౌళి ఆయన ఏదో సరదాగా జోక్ చేశాడు.. మరి ఇంత సెన్సిటివ్గా ఆలోచిస్తున్నావేంటి అన్నట్టు రాజీవ్ తెలిపాడు.
ఆ తర్వాత రోజు సెట్స్లోకి వెళ్తే ఎన్టీఆర్ రాజుగారు నమస్కారం రండి సార్ అంటూ అపరిచితుడులా బిహేవ్ చేసాడని మూడో రోజు మళ్ళీ ఏదో? జోక్ చేశాడని ఇక తర్వాత నుంచి ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెట్టానని తర్వాత బాగా క్లోజ్ అయిపోవడం.. సెకండ్స్ షెడ్యూల్ కు వచ్చేసరికి రాజీవ్ గారు అనే ఎన్టీఆర్ ఒరేయ్ రాజుగా అని పిలిచేవడంతో నేను షాక్ అయ్యాను అంటూ వివరించాడు. మరి ఫ్రెండ్ అంటే అనరా అని ఎన్టీఆర్ అన్నాడట. అప్పటినుంచి మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం అని వివరించాడు.