మన తెలుగు చిత్ర పరిశ్రమలో గత నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా కొనసాగుతూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న చిరంజీవి- బాలకృష్ణ. ఇప్పటికి అదే జోష్తో తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. గత సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగి విజయం సాధించారు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు నేటితరం యంగ్ హీరోలకి కూడా తమ సినిమాలతో గట్టి షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి భోళాశంకర్ సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.
అలాగే బాలయ్య కూడా దసరాకి భగవంత్ కేసరి తో వస్తున్నాడు. అదేవిధంగా ఇద్దరు హీరోలు మరోసారి వచ్చే సంక్రాంతికి బర్లో దిగబోతున్నారంటూ కూడా అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే గతంలో ఓ స్టార్ హీరోయిన్ కారణంగా చిరంజీవి- బాలకృష్ణ మధ్య ఎవరూ ఊహించని గొడవ జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరు బాలకృష్ణ- చిరంజీవి మధ్య గొడవకి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి- బాలకృష్ణ మధ్య అంత పెద్ద గొడవ పెట్టిన హీరోయిన్ మరెవరో కాదు దివంగత నటి సౌందర్య అన్న రూమర్ అప్పట్లో వినిపించేది. ఈమె చిరంజీవితో కలిసి చూడాలని ఉంది అనే సినిమాలో నటించింది. చిరంజీవి సినిమా కంటే ముందే బాలకృష్ణతో మాతో పెట్టుకోకు అనే సినిమా చేస్తానని కూడా ఒప్పుకొని సైన్ కూడా చేసి అడ్వాన్స్ కూడా తీసుకుందట. అదే సమయంలో చిరంజీవితో ఆఫర్ రావడంతో బాలకృష్ణ సినిమాను పక్కనపెట్టి చిరంజీవితో నటించింది.
బాలయ్య సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేసిందట. ఆ తర్వాత బాలకృష్ణ ఆ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టితో సినిమా చేశాడు. ఇక సౌందర్య కారణంగా కూడా అప్పట్లో చిరంజీవికి బాలకృష్ణ కి మధ్య కాస్త వైరం పెరిగిందట. కానీ ఈ మధ్యకాలంలో వీరి మధ్య దూరం తగ్గిందని చెప్పుకోవచ్చు.