ఆమె అంతే… న‌య‌న‌తార‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్‌

కోలీవుడ్ క్రేజీ హీరో విశాల్ హీరోగా ప్రతివర్మ జంటగా తర్కెక్కిన సినిమా మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సీనియర్ దర్శకుడు సెల్వ‌ రాఘవన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న హీరో విశాల్ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమోషన్లలో విశాల్‌కు ఊహించిన ప్రశ్న ఎదురయింది. నయనతార ప్రమోషన్లలో పాల్గొనక పోవడానికి కారణం ఏంటని ? ఓ విలేఖరి ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు విశాల్ మాట్లాడుతూ నయనతార ఏ సినిమా ప్రమోషన్లలోను పాల్గొనరు.. అది ఆమె వ్యక్తిగత హక్కు ఆమె ఖచ్చితంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలని ఆమెను బలవంతం చేయలేం కదా ? అని చెప్పుకొచ్చారు విశాల్‌. ఈ వాఖ్య‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో విశాల్ -నయనతార కాంబినేషన్లో కూడా సినిమాలు వచ్చాయి. తెలుగులో వచ్చిన సెల్యూట్ సినిమా అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.