పవన్ ‘ బ్రో ‘ సినిమాలో ఆ డైలాగ్.. ఎవరికో గట్టిగానే తగిలినట్టుందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా బ్రో నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. టాలీవుడ్ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్‌ని ఎలా ? చూడాలనుకున్నారో ఈ సినిమా ద్వారా అలా చూపించడానికి ట్రై చేశాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని.

వింటేజ్ పవన్ స్క్రీన్ పై కనిపించ‌డంతో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఈ మూవీలో పవన్ గత సినిమాల్లో సాంగ్స్ తో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసాయి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కింది. తమ్ముడు, బద్రి, ఖుషి స్టైల్లో పవన్ కళ్యాణ్ ని చూడాలంటే ఈ సినిమా ద బెస్ట్ ఆప్షన్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెపుతున్నారు.

ఈ సినిమాలో త్రివిక్ర‌మ్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాయ‌క‌పోయినా ఓ డైలాగ్ మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని విమర్శించే వాళ్ళకి కౌంటర్ వేసినట్లుగా ఉందంటన్నారు. ప్రస్తుతం ఆ డైలాగును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఆ డైలాగ్ ప‌వ‌న్ వ్య‌తిరేకుల‌కు బాగా నాటుకునేలా ఉంద‌ని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

” భూమి మీదకి వచ్చిన ప్రతివాడు గెస్ట్.. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ టైం అయిపోయాక వెళ్లిపోవాల్సిందే.. అంతే కానీ మేము దోచేస్తాం అది చేస్తాం..” అంటు చిటిక వేస్తాడు. ఇక ఈ డైలాగు విన్న ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో అర్ధమైపోతుంది. పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వాళ్ళకి గట్టిగానే తగిలేలా ఘాటుగానే పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ చెప్పాడంటూ ఫ్యాన్స్ ఈ డైలాగ్ హైలెట్ చేస్తున్నారు.