వర్షాకాలంలో కీళ్ల నొప్పుల అనారోగ్యం మనుష్యులను ఎక్కువుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ కాలంలో కీళ్ల నొప్పులు మంట మరింత మరింత ఎక్కువ అవుతాయి. కానీ కొన్ని చిట్కాలతో కీళ్ల నొప్పులని నయం చేసుకోవచ్చు. ఆస్తి ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు. అనవసరం. ఇందులో ముఖ్యంగా కీళ్ల నొప్పులు మరి ఇబ్బంది పెడతాయి. వర్షాకాలంలో నొప్పిని మరింత ప్రభావితం చేస్తాయి.
ఏ అనారోగ్యానికి గురికాకుండా ఎటువంటి ఆహారం ? తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పిని తగ్గించుకోవడానికి నాచురల్ పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్డు, ఆకుకూరలు తింటే ఎలాంటి అనారోగ్యానికి గురవ్వరు. అలాగే మంచినీరు ఎక్కువగా తాగాలి. మంచి నీరు రోజుకు 3- 4 లీటర్లకు తగ్గకుండా తాగాలి.
పొద్దున్నే లేచి ఒక గంట సమయం వరకు వాకింగ్, ఎక్సర్సైజ్, యోగ చేసినట్లయితే నీరసం, మలబద్ధకం, కీళ్లపట్టేయడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు 7 – 8 గంటల సమయం వరకు నిద్రపోవాలి. ఈ టైమింగ్ ని మీరు ఫాలో అయినట్లయితే మీ కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి.