బాలయ్య చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చాడు… చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు…ఆ సినిమా ఇదే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిద్దరి మధ్య సినిమాల పరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు దశాబ్దాలుగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకేసారి వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ వార్‌ మరో లెవల్లో ఉంటుంది. గత సంక్రాంతి కూడా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పరి ఇద్దరు విజయం సాధించారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి- బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి వచ్చే నెలో బోళాశంకర్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అలాగే బాలయ్య కూడా దసరాకి భగవంత్ కేస‌రీ సినిమాతో వస్తున్నాడు. అదేవిధంగా 2024 సంక్రాంతి కూడా వీరిద్దరూ మరోసారి బాక్స్ ఆఫీస్ బ‌రిలో దిగిపోతున్నారని కూడా అంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ పోటీపడే ఇద్దరు హీరోలు ఎప్పుడైనా ఒకే వేదిక మీద కనిపిస్తే అదో పెద్ద సంచలమైని చెప్పాలి.

అలాంటిది బాలకృష్ణ, చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమాకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆ సినిమా మరి ఏదో కాదు ఘరానా మొగుడు. అలా ఈ సినిమా ముహూర్తపు షాట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు తెర‌కెక్కించారు. 1992లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘరానా మొగుడు సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో చిరుకు జంటగా నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు.

అలా బాలకృష్ణ ఈ సినిమాకు చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మొదట్లోనే భారీ అంచనలుపెరగాక సినిమా కూడా సూపర్ హిట్ అయ్య‌ చిరంజీవికి తిరుగులేని స్టార్టడం తెచ్చి పెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాకు చిరు రెమ్యున‌రేష‌న్ కోటి ఇచ్చారు. అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం