కోలీవుడ్ హీరోయిన్ గాయత్రి శంకర్ గతేడాది మామనీతమ్, విక్రమ్ సినిమాలతో తనదేన స్టైల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 2012లో ‘ 18 వయసు ‘ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గాయత్రి ‘ నడుపుల కొంజం పక్కత కానోమ్ ‘ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఈ హీరోయిన్కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ అరవింద్ తో డేటింగ్ చేస్తుందంటూ కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ అరవింద్ సుబ్రహ్మణ్యం అందరూ అతన్ని అరవింద్ ఎస్సి అని పిలుస్తారు.
2013 తమిళ్ ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన అరవింద్.. తర్వాత 2016 లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా స్థానాన్ని సంపాదించాడు. యూట్యూబ్ ద్వారా కామెడీ వీడియోస్, హిందీ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ్లో ‘ మద్రాసి డా ‘ అనే షో ద్వారా కూడా అరవింద్ కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్లో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ‘ వి నీడ్ టు టాక్ ‘ అనే కామెడీ షో ని ప్రదర్శిస్తున్నాడు. ఇక విషయానికొస్తే గాయత్రి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటోలను చూస్తే అవుననే అనిపిస్తుంది.
ఆ ఫోటోలో గాయత్రి అరవింద్ను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతేకాకుండా ఆ ఫోటోతో పాటు అతని ఎదుగుదలను ప్రశంసిస్తూ నేను చాలా గర్వపడుతున్నాను అంటూ వివరించింది. రైల్వే రిజర్వేషన్ సిస్టం అవకతవకల జరుగుతాయని మీరు మాట్లాడడం నుంచి ఎంత దూరం ప్రయాణించారు మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేసింది. అరవింద్ పై ఇంత పాజిటివ్గా గాయత్రి ట్యాగ్ చేయడంతో అభిమానులు ఈ జంట డేటింగ్ చేస్తున్నారంటూ.. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటివరకు ఈ విషయంపై అఫీషియల్ గా స్పందించలేదు.