టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈగో లేకుండా అందరితో ఎంతో కలిసిమెలిసి ఉంటూ ఎదిగె కొద్ది ఒదిగి ఉండే వ్యక్తులలో విక్టరీ వెంకటేష్ ఒకడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చానని గర్వం లేకుండా అసిస్టెంట్స్ దగ్గర నుంచి కో ఆర్టిస్ట్ వరకు అందర్నీ ఒకే విధంగా గౌరవిస్తాడు. అందుకే వెంకటేష్ అంటే చాలామంది స్టార్ హీరోలకు ఇష్టం. హీరోయిన్స్ పట్ల కూడా ఆయన ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ ఉంటాడు.
అలా డౌన్ టు ఎర్త్ ఉండే వెంకటేష్ కి కూడా ఓ స్టార్ హీరోయిన్ అప్పట్లో కోపం తెప్పించిందట. ఇంతకీ ఎవరు? స్టార్ హీరోయిన్ అనుకుంటున్నారా. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. ఈమె తెలుగులో కేవలం ఒక్క సినిమాలోని నటించింది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన రావోయి చందమామ సినిమాలో.. అది కూడా ఒక పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఇక గతంలో వెంకటేష్ మరియు ప్రీతిజింతా కాంబినేషన్లో వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమాల్లో మొదటిగా ఐశ్వర్యరాయ్ ని తీసుకోవాలనుకున్నారట మూవీ మేకర్స్. ఆ టైంలో ఐశ్వర్య ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడానికి నిర్మాతలను తెగ ఇబ్బంది పెట్టేసిందట.
కాసేపు డేట్స్ ఇస్తానని కాసేపు ఇవ్వాలని కాసేపు ..నేను ఇచ్చిన డేట్స్ లో అయితేనే నేను నటిస్తానని కండిషన్స్ పెట్టిందట. చివరికి డేట్స్ ఇచ్చిన తరువాత కూడా హోటల్ రూమ్ బుక్ చేయడం దగ్గర నుంచి తన స్టాఫ్ ఖర్చుల వరకు అన్ని ప్రొడ్యూసర్స్ భరించాలని కండిషన్స్ పెట్టేదట. అప్పట్లోనే ఈ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అందులో రూ.50 లక్షల రూపాయలు వెంటనే అడ్వాన్స్ ఇస్తేనే కానీ సినిమాలో నటించినని షరతు పెట్టిందట.
నిర్మాతలు అన్నిటికీ ఓకే అన్నారు కానీ రొమాంటిక్ సన్నివేశాలు నేను నటించను, హీరో లొకేషన్స్ లో షూటింగ్ లేని టైంలో నాకు చాలా దూరంగా ఉండాలి అంటూ పిచ్చి పిచ్చి కండిషన్స్ పెట్టిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ వెంటనే ఐశ్వర్యారాయ్ కి ఫోన్ చేసి గట్టిగా కోటింగ్ ఇచ్చారంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమె కంటే పెద్ద స్టార్ హీరోయిన్ ఎదిగిన ప్రీతిజింతాను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమా కోసం ప్రీతిజింతా ఐశ్వర్య కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఆశించిందట. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ప్రీతిజింతాకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.