సీనియర్ హీరోయిన్ సుహాసిని అందుకే టాలీవుడ్‌కు దూర‌మైందా…!

విజయశాంతి, రమ్యకృష్ణ మాదిరిగా సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి అనే సందేహం అందరికీ వస్తుంది. ఇక గతంలో విజయశాంతి, సుమలత రాధ‌ వంటి హీరోయిన్ల జనరేషన్లో వారందరికంటే ఎంతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది సుహాసిని. ఆమె తోటి హీరోయిన్లు అందరూ గ్లామర్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంటే సుహాసిని మాత్రం అందాల ఆరబోతకు నో చెప్పేవారు.

అలాగే సుహాసిని తన సినిమాల విషయంలో తన రూల్స్ ఎప్పుడు అధిగమించలేదు. అలాగే హోమ్లీ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

చిత్ర పరిశ్రమలో ఉండే హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతారు. తర్వాత వారి ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటూ దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉంటే మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీ అవుతారు. లేదంటే వారి ఫ్యామిలీ లైఫ్ లోనే హ్యాపీగా ఉంటారు. అలాంటి సీనియర్ హీరోయిన్లను ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి ఇప్పటి స్టార్ట్ దర్శకులు తెరపైకి తీసుకువస్తున్నారు.

ఇలా సీనియర్ హీరోయిన్లు మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్న ఘనత మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి దక్కుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో సీనియర్ హీరోయిన్ నదియా మంచి పాపులారిటీ దక్కించుకుంది. మిర్చి సినిమాతో నదియాను కొరటాల శివ చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చాడు. అయితే ఆమెకు స్టార్డం తెచ్చి పెట్టిన ఘనత మాత్రం త్రివిక్రమ్ కి దక్కుతుంది. మరో సీనియర్ హీరోయిన్ ఖుష్భుని కూడా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో నటింపజేశారు త్రివిక్రమ్.

ఈ విధంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమలోనే సీనియర్ నటిమనులు ఎందరో వరుస‌ సినిమాలతో వెండితెరపై దూసుకుపోతున్నారు. అయితే వారందరికంటే తక్కువ సినిమాలు చేసింది సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నమే. ఆమె తలుచుకుంటే ఏడాదిలో 20 సినిమాలు అవలీలగా చేయగలరు. కానీ, వచ్చిన ప్రతీ పాత్రను ఒప్పుకోవడం లేదు. పైగా చాలా సెలెక్టివ్‌గా దర్శకులను చూసి సినిమా ఒప్పుకుంటున్నారు. దానివల్లే సుహాసిని టాలీవుడ్‌లో అంతగా కనిపించడం లేదు.