ప్రపంచంలోని టాప్ 10 వ్యాపారవేత్తలలో ముఖేష్ అంబానీ ఒకరు. బిలియన్ల సంపద ఉండటమే కాకుండా ఖరీదైన కార్ల కాన్వాయ్ కూడా ఉంది. అంబానీ కుటుంబం తరచుగా బెంట్లీ బెంటాయిగా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్విఆర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్హెడ్ కూపే, లంబోర్ఘిని ఉరుస్లలో ప్రయాణిస్తుంటారు.
భద్రత కారణంగా ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కాకుండా వేరే కారులో ప్రయాణిస్తాడు. వారికి ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నా.. ఇప్పుడు మరింత సెక్యూరిటీతో ఉండే కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు కోనుగోలు చేశారు. ఆ కారు ధర సుమరు రూ.10 కోట్ల పైమాటే. ఈ కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పుడు తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్ప్రూఫ్ సెడాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఇది కూడా ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. రీసెంట్గా అంబానీకి బెదిరింపులు రావడంతో ఇప్పడు కోనుగులో చేసిన కారు ప్రత్యేకతలు వైరల్గా మారాయి. ఈ కారు గురించి చెప్పలంటే ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది.
సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ. అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ – లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ కూడా ఈ కార్కు ఉంది. ఈ కారు కేవలం తుపాకుల దాడికే రక్షణ ఇవ్వగలదు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.
ఈ కారు గ్రానైట్ దాడి నుంచి కూడా కారులో ప్రయాణించే వ్యక్తులకు రక్షణ ఇవ్వగలదు. అంతేకాదు ఫైర్ ఆక్సిడెంట్ నుంచి కూడా ఇది కారులో ఉన్న వారిని రక్షిస్తుంది. ఈ విలాసవంతమైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్తో 612 పవర్ను, 830 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.