రగులుతోంది మొగలి పొద, వేణువై వచ్చాను భువనానికి.. వంటి పాటలు వింటే.. ఈ రెండు పాటలకు మధ్య ఎక్కడా పోలిక ఉండదు. ఒకటి పూర్తిగా శృంగారభరితం అయితే.. రెండో పూర్తిగా ప్యాతోస్(దీనం)తో కూడి ఉంటుంది. కానీ, ఈ రెండు పాటల్లోనూ నటించింది ఒక్కరే. వాటికి న్యాయం చేసింది కూడా ఒక్కరే ఆమే.. మాధవి. చిరంజీవి నటించిన అనేక సినిమాల్లో మాధవి హీరోయిన్ పాత్రలుపోషించింది.
అయితే.. సినిమా రంగానికిఆమెను తమిళ దిగ్గజ దర్శకుడు బాల చందర్ పరిచయం చేశారు. మరో చరిత్ర నుంచి అమావాస్య చంద్రుడు వరకు అనేక సినిమా ల్లో మాధవి నటించింది. ఇక, తెలుగులోకి వచ్చేసరికి కోదండరామిరెడ్డి తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆమె నటించారు. తెలుగులో మరో సరితగా పేరు తెచ్చుకున్న మాధవికి అభిమాన గణం కూడా ఎక్కువగానే ఉండేవారు.
అయితే.. ఆమెకు తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువగా అభిమానులు ఉండేవారు. తమిళంలో ఆమె తెలుగులోకన్నా ఎక్కువ సినిమాల్లో నటించడమే దీనికి కారణం. పైగా.. ఏ పాత్రకైనా ఓకేచెప్పేయడం మాధవి నైజం. ఇక, చిరంజీవి తో అయితే.. ఆమె పోషించిన పాత్రలు అన్నీ ఇన్నీ కాదు. ఈ జంట తెలుగు ప్రేక్షకులకు కనుల పంటగా మారారనే కామెంట్లు కూడా వచ్చేవి.
ఇలాంటి మాధవి ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ పెద్దగా అవార్డులు సంపాయించుకోలేక పోవడానికి.. చిరస్థాయిగా నిలిచిపోకపోవడానికి కారణం ఆమె చేసిన తప్పేనని అంటారు ఆమె అభిమానులు. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ హిట్టయిన సినిమాల్లో మాధవి నటించినా.. ఆమె ఏ దర్శకుడినీ నమ్మేది కాదట.
తనకు అందరూ సమానమనే మాటను వినిపించేవారట. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని చెబుతారు. ఎందుకంటే.. అప్పట్లో హీరోయిన్లు..దర్శకులకు `అనుకూలం`గా ఉండేవారు అనే టాక్ వినిపించేది. కానీ, మాధవి మాత్రం తటస్థంగా ఉండడంతో రాను రాను ఆమెకు అవకాశం తగ్గిపోయిందని సినీ విమర్శకులు చెప్పేవారు. ఇదే ఆమె నట జీవితంలో చేసిన పెద్దపొరపాటుగా పేర్కొనే వారు.