బాలయ్య ‘ భగవంత్‌ కేసరి ‘ సినిమా పై ఇంత ఛండాలమైన రూమరా..? ఫైర్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్..!!

నందమూరి నట‌సింహం బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ కీ రోల్‌లో న‌టిస్తున్న ఈ సినిమాకి ధమన్ మ్యూజిక్ అందించారు. షూటింగ్ సెట్స్‌ పై ఉన్న ఈ సినిమా దసరాకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చాయి.

అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా అంచనాలు మరింతగా పెరిగాయి. ఈసారి భగవత్ కేసరి తో పక్కా హిట్ కొట్టి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకుంటాడనే ధీమాగా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ టైంలో ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో 1992లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఖుదా గవా అనే సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా ఉందంటూ.. అమితాబచ్చన్, శ్రీదేవి, నాగార్జున నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌కి ఇచ్చిన మాటకోసం శత్రువుని చంపుతాడు అమితాబచ్చన్.

అదే టైంలో స్నేహితుడి కోసం జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరోపక్క ఇతను ఎవరో? తెలియకుండా కూతురు పెరిగి పెద్దది అవుతుంది. ఇక బాల‌య్య‌ భగవంత్ కేసరి అమితాబచ్చన్ ఖుదా గవా సినిమాలకు దగ్గర పోలికలు ఉంటాయని.. దాదాపు రెండు కథలు ఒకేలా ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో బాల‌య్య కూడా చెయ‌ని త‌ప్పుకి శిక్ష అనుభవిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఇందులో ఆయన కూతురుగా శ్రీ లీలా కనిపించబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ లెక్కలో నిజంగానే భగవంత్‌ కేసరి.. నిజంగానే ఖుదా గవా రీమేకా లేదా ..?రెండు వేరువేరు కథలా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజ‌న్స్‌.