మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. అలాంటి చిరంజీవి సినిమాలు అన్ని దాదాపు మ్యూజికల్ హిట్స్ అని అందరికి తెలుసు. సినిమా ఎలాగున్నా పాటలు మాత్రం మారుమోగిపోతాయి. కేవలం పాటల కోసమే థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. చిరుకి మ్యూజిక్, పాటలు పై మంచి టేస్ట్ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం. ఇదివరకు చిరంజీవి నటించిన అన్ని పాటలకు వన్స్ మోర్ అంటూ థియేటర్స్లో ప్రేక్షకుల అరుపులు వినిపిస్తూనే ఉండేవి. ప్రస్తుతం చిరు పాటల్లో ఇదివరకటి క్రేజ్ లేదు. సైరాలో ఒక్క పాట కూడా మనకు గుర్తుండదు.
ఆచార్యలో పాట ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. గాడ్ ఫాదర్లో అయితే పాటలు ఉన్నాయో లేదో కూడా ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు భోలా శంకర్ కూడా అదేవిధంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పటికీ భోలా శంకర్ నుంచి రెండు పాటలు వచ్చాయి ఆ రెండు పాటలు హిట్ కాలేదు. పాటల విషయంలో ఎప్పుడు హిట్ కొట్టే చిరు ఇప్పుడు ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదు అని ఫ్యాన్స్ అనుమానం. చిరంజీవి పాటలు అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అంతా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గిపోయింది. చిరు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన తరువాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు హిట్ గానే నిలిచాయి.
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ అయితే చిరు అభిమానులకు నచ్చేలా దేవి డిజైన్ చేశాడు. వాల్తేరు వీరయ్య లోని చాలా పాటలు హిట్ గా నిలిచాయి. దీంతో ప్రస్తుతం చిరంజీవి దేవిశ్రీ ని మిస్ అవుతున్నాడని.. అందుకే తన నెక్స్ట్ సినిమాకు దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడని.. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చిరంజీవి నటించబోతున్న సినిమాలో దేవి శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. చిరు – వశిష్ట కాంబినేషన్లో వచ్చే మూవీకి కీరవాణి సంగీతం అందించబోతున్నారు . ప్రస్తుతం కీరవాణి మంచి ఫామ్ లో ఉన్నాడు అలాగే చిరంజీవి కీరవాణి కలిసి పనిచేసే చాలా కాలం అయింది కాబట్టి కాంబినేషన్లో చిరు సినిమా సాంగ్స్ వస్తే కచ్చితంగా హిట్ అవుతాయని చిరు నమ్ముతున్నాడట.