తెలుగు చత్ర పరిశ్రమలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి. ఇక ఆయన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి 10 మందికి పైగా టాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్నారు. చిరంజీవి తన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలోలో నటించారు. ఇక ఎన్నో ప్లాప్ సినిమాలు కూడా వచ్చాయి.
చిరు నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై టి. సుబ్బిరామిరెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను యాక్షన్ సినిమాల దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా రాధా, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి ఆటతో ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.
కానీ చివరకు ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే ఈ స్టేట్ రౌడీ నైజాంలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా వచ్చిన రోజుల్లో బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ సూపర్ క్రేజ్తో దూసుకుపోతున్నాడు. ఆ సమయంలో అమితాబ్ తో సినిమా అంటే నిర్మాతలకు కాసులు వర్షం కురిపించేవి. కానీ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా మాత్రం అమితాబ్ బచ్చన్ సినిమా కలెక్షన్లు మించి వసూలు చేయడం మరో విశేషం.
ఆ రోజుల్లోనే ఈ విషయం చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. చిరు స్టేట్ రౌడీ సినిమా ఇంతటి భారీ కలెక్షన్లు సాధించడంతో ట్రేడ్ గైడ్ మ్యాగజిన్ స్టేట్ రౌడీ సినిమా కలెక్షన్లు వివరిస్తూ ఆర్టికల్ లో వేర్ ఈజ్ అమితాబ్ అంటూ ప్రశ్నిస్తూ.. ఓ ఆర్టికల్ కూడా విడుదల చేసింది. అప్పట్లో ఈ మ్యాగజైన్ చదివిన పలువురు హిందీ ప్రముఖులు సైతం వేర్ ఈజ్ అమితాబ్ అనే పదాన్ని చదివి ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట.
ఇక ఆ సమయంలో ఈ స్టేట్ రౌడీ సినిమా దేశం మొత్తం రికార్డుల పరంగా సంచలనాలు క్రియేట్ చేసింది. అంతేకాదు వంద రోజులు వేడుకలను కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడంతోపాటు చిరంజీవి కేరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా సినిమా నిలిచిపోయింది.