వాల్తేరు వీరయ్య – వీరసింహారెడ్డి సరసన బేబీ… ఇది మామూలు రికార్డు కాదుగా..!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ బేబీ. ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కలర్ ఫోటో లాంటి సెన్సేషనల్ హిట్ సాధించిన డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందే ఫస్ట్ లుక్, టీజర్, పాటలతో మంచి హైప్‌ తెచ్చుకున్న ఈ సినిమా జులై 14న గ్రాండ్‌గా రిలీజై ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ సాధించింది.

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి , విరాజ్‌ అశ్విన్‌ తమ నటనతో అదరగొట్టారు. వైష్ణవి చైతన్యకు ఇది మొదటి సినిమా అయినా పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది. ఈ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమ మాయలో పడి ఎలా.. మోసపోతున్నారు.. ఎంతగా.. నష్టపోతున్నారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఆధారగొడుతుంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.8 కోట్ల బ్రేక్ ఇవన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.23.53 కోట్ల షేర్‌ రూ.44.60 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. కలెక్షన్స్ తో పాటు ఓ అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేసింది బేబీ మూవీ.

ఈ ఏడాది రిలీజైన‌ వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి తర్వాత మొదటి వారంలో ప్రతిరోజు రూ.2 కోట్లకు తగ్గకుండా షేర్‌ని 7 రోజులు పాటు సాధించింది. ఈ సినిమా డే వైజ్‌ సాధించిన కలెక్షన్స్ మొదటిరోజు రూ.2. 60 కోట్లు రెండవ రోజు రూ.2.98 కోట్లు మూడో రోజు రూ.3.77 కోట్లు నాలుగవ రోజు రూ.3.72 కోట్లు ఐదవ రోజు రూ.2.94 కోట్లు ఆరవ రోజు రూ.2.45 కోట్లు ఏడవ రోజు రూ.2 కోట్లు రాబ‌ట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ.20.46 కోట్లు షేర్ రాగా.. రూ.36.90 కోట్ల గ్రాస్ రాబట్టి సూపర్ రికార్డును సెట్ చేసింది.

వాల్తేరు వీరయ్య 10 రోజులు పాటు రూ.2 కోట్ల కలెక్షన్ తగ్గకుండా వసూలు చేస్తే.. వీరసింహారెడ్డి 7 రోజులు పాటు రూ.2 కోట్లకు తాగకుండా షేర్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా బేబీ కూడా లిస్టులో చేరిపోయింది. వరుసగా 7 రోజులు పాటు రూ.2 కోట్లకు తగ్గకుండా షేర్ అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక ఈ సినిమా ఓటిటి విషయానికి వస్తే థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఆహా కొనుగోలు చేసింది. ఈ సినిమా ఆగస్టు నెలలో ఆహా కి స్ట్రీమింగ్ కానుంది. ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా సినిమాను రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.