వానాకాలంలో ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

వానకాలం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా రోగాల భారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, ఫ్లూ భారిన పడి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవడం చాలా మంచిది. మనం తినే ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. వానా కాలంలో చల్ల చల్లగా ఉండే వాతావరణం లో చాలామంది టీలు, కాఫీలు తాగుతూ ఉంటారు. వాటికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్‌టీ వాడడం మంచిది.

అల్లం, మిరియాలు, తేనె, నిమ్మ టీలను సేవిస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే వేడివేడిగా చల్లని వాతావరణంలో బజ్జీలు, బోండాలు లాంటివి తినడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు వాటికి బదులుగా ఉగ్గాని, సెనగలు, పెసలు, గుగ్గిళ్ళు, సగ్గుబియ్యం కిచిడి.. లాంటివి తీసుకోవడం మంచిది. పుదీనా, తులసి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి వీటితో కషాయం కాచుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రాగులు, సోయాబీన్స్, సజ్జ‌లు, మొక్కజొన్నలు లాంటి చిరుధాన్యాలను ఆహార భాగంలో చేసుకుంటే ఎన్నో అనారోగ్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వాటితో పాటు పోషక విలువలు ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెరీ, అరటి లాంటి ఫ్రూట్స్ తో పాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర లాంటివి కూడా తీసుకోవాలి . దాల్చిన చెక్క ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగి ఉన్న దాల్చిన చెక్కను రోజు రాత్రి వేళలో పొడి చేసుకుని పాల‌తో తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

నేరేడు పండు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కనిజాలు, ఫైటో కెమికల్స్ నేరేడు పండ్లలో పుష్కలంగా ఉంటాయి. వాన కాలంలో వచ్చే అథిసార, కలరా వ్యాధులతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లకు నేరేడు ఓ మంచి ఔషధం. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో అనేక వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి సాయపడుతుంది. రాత్రిపూట చిటికెడు పసుపును వేడివేడి పాలలో కలుపుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

లవంగం రోగ నిరోధక శక్తిని పెంచడానికి గొంతు నొప్పి లాంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగి ఉన్న దాల్చిన చెక్కను రోజు రాత్రి వేళలో పాలను పొడి చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలో ఉండే శాతాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలవపాతం చేసే చక్కెర పదార్థాలు అంటే ఐస్ క్రీమ్, కేక్స్, క్యాండీ, చాక్లెట్, కూల్డ్రింక్స్ లాంటి వాటికి వాన కాలంలో దూరంగా ఉండటం మంచిది.

ఇవి వ్యాధి నిరోగినిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు . చాలామంది బయట ఫుడ్‌, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఫుడ్లను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. హైబీపీ, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్, ధూమపానం శరీరానికి బలహీనంగా మారుస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.