గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు.. శైలజ గురించి తెలిసింది తక్కువ. ఎందుకంటే.. ఆమె తెరమీద ఎక్కువగా కనిపించరుకాబట్టి ఆమె గురించి.. ప్రత్యేకంగా చర్చించేవారే లేకుండా పోయారు. సరే.. శైలజ.. తొలినాళ్లలో హీరోయిన్ పాత్రలకు నటించాలని చూశారు. వాస్తవానికి బాలసుబ్రహ్మణ్యం .. సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా ప్రవేశించారు. అది కూడా అతిథి పాత్రలకు ఆయన పాటలు పాడేవారు.
తర్వాత తర్వాత.. ఘంటసాల అనారోగ్యం భారిన పడిన తర్వాత.. బాలుకు దశ తిరిగింది. దాదాపు 35 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన గాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కుటుంబం నుంచి తొలుత అరంగేట్రం చేసింది.. ఆయన సోదరి శైలజ. అన్నగారితోపాటు ఒకటి రెండుసార్లు రికార్డింగ్ స్టూడియోల వద్ద చూసిన.. దర్శకుడు కే. విశ్వనాథ్ శైలజను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
సాగర సంగమం సినిమాలో జయప్రదకు కుమార్తె పాత్రలో కనిపించారు శైలజ. నాట్ర ప్రాధానన్యం ఉన్న సినిమాలో ఆమెకు తొలి అవకాశం వచ్చింది. ఓం నమశ్శివాయ.. పాటను శైలజ మీదే చిత్రీకరించారు. సినిమాలో ఆసాంతం ఆమె ఒకింత వగరు, పొగరు ఉన్న కారెక్టర్గా నటించడం విశేషం. అయితే.. తర్వాత కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు.
దీనికి కారణం.. లేనిపోని అలవాట్లు.. ఇతరత్రా.. విమర్శలు.. గ్యాసిప్లు వంటివి వెంటాడుతాయనే భయం ఆమెను సినిమాల జోలికి పోనివ్వకుండా అడ్డుకున్నాయి. అయితే.. తర్వాత కాలంలో బాలు తన చెల్లిని కూడా ఎదకుండా అడ్డుకున్నాడు. అందుకే ఆమెకు నటించాలని ఉన్నా.. తన కోరికను చంపుకుందని.. విమర్శలు, వార్తలు వచ్చాయి. అయితే.. అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి దీనిపై వివరణ ఇచ్చారు.