బాల‌య్య ‘ అఖండ ‘ సెంటిమెంట్ ఫాలో అవుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘ బ్రో ‘ ..!

టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా వస్తుందంటే అంద‌రికి టిక్కెట్ రేట్లు గుర్తుకు వ‌చ్చేస్తాయి. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు అంద‌రూ క‌లిసి ప్ర‌భుత్వాల ముందు విన్న‌పాలు చేసుకుంటూ రిక్వెస్టులు పెట్టుకుంటారు. తొలి మూడు రోజులో లేదా తొలి వారం రోజులో టిక్కెట్ రేట్లు పెంచుకుంటామ‌ని చెపుతుంటారు. ఏదోలా టిక్కెట్ రేట్లు పెంచుకుంటామ‌నిపించుకుంటారు.

ఇది తెలుగులో పెద్ద హీరోలు, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు కామ‌న్‌గా మారిపోయింది. అయితే మ‌రో 9 రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ బ్రో సినిమాకు మాత్రం టిక్కెట్ రేట్లు పెంచ‌డం లేద‌ట‌. దీనిపై నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. తాము అనుకున్న బ‌డ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం.. బిజినెస్ కూడా బాగా జ‌రిగింది.. అందుకే తాము టిక్కెట్ రేట్లు పెంచే ఆలోచ‌న చేయ‌డం లేద‌ని చెప్పేశారు.

ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న రేట్ల‌తోనే బ్రో సినిమాను ప్ర‌ద‌ర్శిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇక బ్రో సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్ల విష‌యంపై కూడా ఆయ‌న స్పందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పెష‌ల్ ప్రీమియ‌ర్ల ఆలోచ‌న లేద‌ని.. చిన్న సినిమాల‌కు త‌మ కంటెంట్ చూపించుకునేందుకే ప్రీమియ‌ర్లు వేస్తుంటారు.. బ్రో సినిమాకు ఆ అవ‌స‌రం లేద‌నుకుంటున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

ఇక పెద్ద సినిమాల్లో బాల‌య్య అఖండ సినిమాకు కూడా టిక్కెట్ రేట్లు పెంచ‌లేదు. ఆ సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో అంద‌రు హీరోల అభిమానులు అఖండ‌ను రెండు మూడు సార్లు చూసి మ‌రీ హిట్ చేశారు. ఇప్పుడు ఈ విష‌యంలో ప‌వ‌న్ బ్రో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న‌ట్టు ఉంది.

ఇక బ్రో సినిమా ఈనెల 28న థియేటర్లలోకి వస్తోంది బ్రో సినిమా. పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ది గెస్ట్ రోల్ కాదని, అతడు ఫుల్ లెంగ్త్ రోల్లో క‌నిపిస్తార‌ని కూడా నిర్మాత తెలిపారు. ఈ నెల 25న ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ పెట్టుకున్నారు