తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ కపుల్స్ లో మహేష్- నమ్రత జంట కూడా ఒకటి.. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమా ద్వారా వీరిద్దరూ ఒకటయ్యారు.. దాదాపు నాలుగు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి 2005లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మహేష్ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇదే క్రమంలో మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు నమ్రత దగ్గరుండి చూసుకుంటూ వస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ,వాటితో విడాకులు వరకు వెళ్తున్న జంటల్ని మనం చూస్తూనే ఉన్నాం. మహేష్-నమ్రత పెళ్లి చేసుకుని దాదాపు 18 సంవత్సరాలు అవుతున్న వారి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా తమ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఇక వీరికి గౌతమ్, సితారనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.
ఇదే సమయంలో నమ్రత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. అలా వాటిలో నమ్రత తొలిసారిగా ప్రెగ్నెంట్ అయినా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడిందట. అంతేకాకుండా ఆ సమయంలో నమ్రత మరింత డిప్రెషన్ కు లోనై పదేపదే ఏడుస్తూ ఉండేదట.. మహేష్ ఎంత చెప్పినా కూడా నార్మల్ గా వచ్చేది కాదట..దానికి కారణం నమ్రత ఆ సమయంలో ఎంతో బలహీనంగా ఉండేదట.. అసలు సరైన ఆహారం తినేది కాదట.
ఎప్పుడు ఏడుస్తూ ఉండడంతో.. దాంతో మహేష్ నమ్రతను నార్మల్ గా మార్చడానికి లాగిపెట్టి చెంప మీద ఒకటి కొట్టాడట.. అది కూడా డాక్టర్లు చెబితేనే కొట్టాడట . ఇక అప్పటినుంచి నమ్రత నార్మల్ మూడ్లోకి వచ్చిందట.. తొలి ప్రెగ్నెన్సీ టైంలో నమ్రత పడిన ఇబ్బందులు గురించి ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు కూడా ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీ అవ్వనున్నాడు . ఇలాంటి సమయంలో మహేష్ బాబు పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.