అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు శోభన్ బాబు. కోట్లాదిమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరోల్లో శోభన్ బాబు ఒకరు. ఈ జనరేషన్ హీరోలలో మహేష్ బాబుకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లోనే శోభన్ బాబుకు ఉండేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. శోభన్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ దగ్గర మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ ఎక్కువగా క్యూ కట్టేవారట.
అప్పట్లో శోభన్ బాబు చనిపోయినప్పుడు కూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు ఇళ్లలో లేడీస్ కూడా తమ ఇంట్లో స్టార్ హీరోలు ఉన్నాసరే శోభన్ బాబు అంటేనే తమకు ఇష్టం అని చెప్పేవారట. అంతలా పాపులారిటి దక్కించుకున్నాడు శోభన్ బాబు. ఇక ఆయన సినిమాలలో నటించి సంపాదించిన ఆస్తులు మొత్తం భూమి కొనుగోలు చేసేందుకే ఖర్చు చేసే వాడట.
భూమిమీద డబ్బులు పెడితే అంతకు రెట్టింపు స్థాయిలో తిరిగి వస్తుందని నమ్మిన ఏకైక హీరో శోభన్ బాబు. అలా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే కొన్ని వేలకోట్ల ఆస్తులను కూడ పెట్టాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆయన స్నేహితుడు అయిన మరో సీనియర్ హీరో మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. శోభన్ బాబు గురించి చర్చ మొదలైనప్పుడల్లా మొదట వినిపించేది ఆయన ఆస్తుల టాపికే.
మురళీమోహన్ హీరోగా ఉన్నప్పుడే శోభన్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతూ కొన్ని వేల ఎకరాలు కొన్నాడట. అసలు చెన్నై చుట్టు పక్కల ఆయనకు ఉన్న ఆస్తులు చూస్తే కళ్లు జిగేల్ మంటాయట. అవన్నీ ఇప్పుడు లెక్కలు చూస్తే రూ.80 వేల కోట్లకు పైగా ఉంటాయని అంటారు. కొందరు అయితే వాటి విలువ లక్ష కోట్ల పైనే అని సమాచారం. ఇన్ని ఆస్తులు సంపాదించిన శోభన్ బాబు కొడుకులని మాత్రం సినిమాలకి పరిచయం చేయలేదు. ఇక శోభన్ బాబు కొడుకు కూడా తమ ఆస్తులను పెంచుకుంటూ చెన్నైలో టాప్ రియల్డర్గా ఉన్నారు.